శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 26: శ్రీకాళహస్తి పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 23 మంది లబ్ధిదారులకు మంజూరైన ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషిత రెడ్డి స్వయంగా అందజేశారు. మానవీయ కోణంలో ఆమె లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి చెక్కులను పంపిణీ చేయడం విశేషం.వ్యాధి తీవ్రతను బట్టి ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ. 30,000 నుండి గరిష్టంగా రూ. 2, 96,050 వరకు వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరు చేసింది. పట్టణంలోని నెహ్రూ స్ట్రీట్, ఎంజీ స్ట్రీట్, పద్మశాలిపేట, ఉప్పు వీధి, అరుందతి వాడ, గాంధీ వీధి, ఎన్టీఆర్ నగర్, శ్రీరామ్ నగర్ కాలనీ వంటి 17కు పైగా ప్రాంతాల్లో బాధితులకు ఈ సాయం అందింది. ఈ సందర్భంగా రిషిత రెడ్డి మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరంగా మారిందన్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రజా సేవలో ఎమ్మెల్యే కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని ఆమె పేర్కొన్నారు. కష్టకాలంలో ప్రభుత్వం, ఎమ్మెల్యే కుటుంబం తమను ఆదుకోవడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

లబ్ధిదారుల చెంతకేళ్లి సి. యం.ఆర్. యఫ్. చెక్కులిచ్చిన ఎమ్మెల్యే సతీమణి
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 26: శ్రీకాళహస్తి పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 23 మంది లబ్ధిదారులకు మంజూరైన ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషిత రెడ్డి స్వయంగా అందజేశారు. మానవీయ కోణంలో ఆమె లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి చెక్కులను పంపిణీ చేయడం విశేషం.వ్యాధి తీవ్రతను బట్టి ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ. 30,000 నుండి గరిష్టంగా రూ. 2, 96,050 వరకు వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరు చేసింది. పట్టణంలోని నెహ్రూ స్ట్రీట్, ఎంజీ స్ట్రీట్, పద్మశాలిపేట, ఉప్పు వీధి, అరుందతి వాడ, గాంధీ వీధి, ఎన్టీఆర్ నగర్, శ్రీరామ్ నగర్ కాలనీ వంటి 17కు పైగా ప్రాంతాల్లో బాధితులకు ఈ సాయం అందింది. ఈ సందర్భంగా రిషిత రెడ్డి మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరంగా మారిందన్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రజా సేవలో ఎమ్మెల్యే కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని ఆమె పేర్కొన్నారు. కష్టకాలంలో ప్రభుత్వం, ఎమ్మెల్యే కుటుంబం తమను ఆదుకోవడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

