రైల్వే కోడూరు లో బుధవారం 24 వ తారీకు నా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ యం. భాస్కర్ రెడ్డి అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం, వికసిత భారత్ 2047 కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు సేవా భావన పెంపొందించుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇతరులకు సహాయం చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఎన్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్ శ్రీ దాసరి మోషే మాట్లాడుతూ 1969 సెప్టెంబర్ 24న విద్యార్థుల్లో సేవా స్పూర్తి కలిగించేందుకు ఏర్పడిన ఎన్ఎస్ఎస్ నేడు అన్ని కళాశాలల్లో ప్రజలకు ప్రయోజనకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేష్ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి అవసరమని పేర్కొన్నారు. ఐక్యూఏసీ కోఆర్డినేటర్ శ్రీ జి. దయానందం మాట్లాడుతూ సేవా కార్యక్రమాల ద్వారా విద్యార్థులు ప్రజలతో దగ్గరగా మెలగడానికి అవకాశం దొరుకుతుందని చెప్పారు. వికసిత భారత్ కోఆర్డినేటర్ శ్రీ కె. పి. కృష్ణమూర్తి మాట్లాడుతూ వికసిత భారత్ 2047 సాధనలో ఎన్ఎస్ఎస్ కీలకమని వివరించారు. విద్యార్థులు రూపొందించిన పోస్టర్ ప్రజెంటేషన్ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

రైల్వే కోడూరులో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం – వికసిత భారత్ 2047 కార్యక్రమం ఘనంగా
రైల్వే కోడూరు లో బుధవారం 24 వ తారీకు నా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ యం. భాస్కర్ రెడ్డి అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం, వికసిత భారత్ 2047 కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు సేవా భావన పెంపొందించుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇతరులకు సహాయం చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఎన్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్ శ్రీ దాసరి మోషే మాట్లాడుతూ 1969 సెప్టెంబర్ 24న విద్యార్థుల్లో సేవా స్పూర్తి కలిగించేందుకు ఏర్పడిన ఎన్ఎస్ఎస్ నేడు అన్ని కళాశాలల్లో ప్రజలకు ప్రయోజనకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేష్ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి అవసరమని పేర్కొన్నారు. ఐక్యూఏసీ కోఆర్డినేటర్ శ్రీ జి. దయానందం మాట్లాడుతూ సేవా కార్యక్రమాల ద్వారా విద్యార్థులు ప్రజలతో దగ్గరగా మెలగడానికి అవకాశం దొరుకుతుందని చెప్పారు. వికసిత భారత్ కోఆర్డినేటర్ శ్రీ కె. పి. కృష్ణమూర్తి మాట్లాడుతూ వికసిత భారత్ 2047 సాధనలో ఎన్ఎస్ఎస్ కీలకమని వివరించారు. విద్యార్థులు రూపొందించిన పోస్టర్ ప్రజెంటేషన్ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

