– పట్టా రిజిస్ట్రేషన్ దారులకు పట్ట పాస్బుక్కులు అందేన!!
ఆరు నెలల సాగు సీజన్ సన్నాహాల్లోనే రైతు నిరాశ!
పాస్బుక్ జారీ జాప్యం రుణాల ఆమోదం దెబ్బతిని, పంటలు ప్రమాదంలో
కామారెడ్డి, 11 నవంబర్ (పున్నమి ప్రతినిధి) :
భూమాత సిస్టమ్లో రిజిస్ట్రేషన్ పూర్తయినా, వేలాది మంది రైతులకు పట్టాదారు పాస్బుక్లు అందక సతమతమవుతున్నారు. గత ఆరు నెలలుగా పాస్బుక్ ముద్రణ ఆగిపోవడంతో రైతు జీవనం స్తంభించింది. సాగు సీజన్ అంచున ఉన్న ఈ సమయంలో పాస్బుక్ లేక బ్యాంకులు రుణాలు ఆపివే యడంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడం కష్టమైపోయింది.ప్రతి నెలా వందల సంఖ్యలో కొత్త రిజిస్ట్రేషన్లు పూర్తవుతు న్నా, హైదరాబాదులోని ముద్రణ కేంద్రాల్లో పాస్బుక్ ఫైళ్లు పేరుకుపోతున్నాయనే సమాచారం బయటికి వచ్చింది. రెవెన్యూ అధికారులు కొత్త పాస్బుక్ డిజైన్ తయారీ కారణంగా ఆలస్యం జరుగుతోందని తెలిపారు. కానీ ఈ వివరణ రైతులకు భరోసా ఇవ్వలేకపోతోంది.“నామాలు స్క్రీన్లో కనిపిస్తున్నాయి కానీ పాస్బుక్ చేతికి అంద డం లేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. సాగు ఎలా చేయాలి?” అని కామారెడ్డికి చెందిన ఒక రైతు బాధతో పేర్కొన్నాడు. మరో రైతు మాట్లాడు తూ, ఆరు నెలలు చాలా ఎక్కువ. ఇంత ఆలస్యం అయితే పంట కాలమే దెబ్బతింటుంది” అని ఆవేదన వ్యక్తం చేశాడు.రైతు సంఘాలు ఇప్పటికే రెవెన్యూ, తపాలా కార్యాలయాల వద్ద ధర్నాలు ప్రారంభించాయి. “ముద్రణ సాంకేతికత పేరిట రైతుల భవిష్యత్తు ఆగిపోవడం విచారం. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి,” అని రైతు సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.ఈ పాస్బుక్ జాప్యం ప్రత్యక్షంగా రుణాల విడుదలపై ప్రభావం చూపుతోంది. రుణాలు లేకపోవడం వల్ల విత్తనాలు, నీటిపారుదల సరఫరా నిలిచిపోగా, వ్యవసాయ కార్యకలాపాలు.ఆలస్యమవుతున్నా యి. విశ్లేషకుల అంచనా ప్రకారం, వీటితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉందం టున్నారు.రైతులు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోకుం డా ఉండాలంటే, పాస్బుక్ ముద్రణను అత్యవసర ప్రాధాన్యంగా తీసుకుని వేగవంతం చేయాలని రాష్ట్రస్థాయి వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తు న్నారు.లేదంటే రైతు భరోసా కేవలం కాగిత మాటగా మిగిలిపోతుందనే వాదనాలు వినిపిస్తు న్నాయి. రైతు పాస్బుక్ల ముద్రణ నిలిచిపోవ డంతో రైతులు తీవ్ర ఆందోళనకు దిగిపోయారు. ఈ నేపథ్యంపై ఇప్పటికీ రైతు సంఘాలు, శ్రామిక సంఘాలు ముందుకొచ్చి వివిధ ఆందోళన కార్యక్ర మాలను నిర్వహిస్తున్నారు. వారు వరుసగా రెవె న్యూ, తపాలా కార్యాలయాల చుట్టూ పాదయాత్ర లు, ధర్నాలు చేపట్టి ప్రభుత్వం వెంటనే పాస్బుక్ ముద్రణ చర్యలను వేగవంతం చేయాలని డిమాం డ్ చేస్తున్నారు. వారు రుణాలు సిద్ధంచేయ డానికి, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకోవడానికి పాస్బుక్ అనివార్యమే కావడం, పాస్బుక్ ఆల స్యం వల్ల రైతుల సాగు సీజన్ గడువు కోల్పోవడం, ఆర్థికంగా తీవ్ర సమస్యలు ఎదుర్కోడం గురించి ప్రభుత్వానికి బహిరంగంగా అలర్ట్ ఇస్తున్నారు. రైతు సంఘాలు రైతుల తరపున శక్తివంతంగా పాటుపడటంతో పాషణి ముద్రణ ప్రక్రియపై ప్రభు త్వం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అని వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకూ పాస్బుక్ జారీ ఆలస్యం సమస్యపై అధికారుల ప్రతిస్పందన పరిమితమే. దీంతో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. రైతుబంధు, రైతు భరోసా వంటి పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందుతున్నప్పటికీ పాస్బుక్ లేకుండా ఆ పథకాల ప్రయోజనాలు రైతులకు సకాలంలో అందటం లేదు. పట్టాదారుల పట్టా పత్రాల జారీ సమస్య పరిష్కారమైతే, రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.


