Wednesday, 25 March 2026
  • Home  
  • రేపు ఎల్లంపల్లికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రాక.. — ఎర్ర రాజశేఖర్ కుటుంబాన్నీ పరామర్శించడానికి కదిలి వస్తున్న ఎమ్మార్పీఎస్ దండు *
- రంగారెడ్డి

రేపు ఎల్లంపల్లికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రాక.. — ఎర్ర రాజశేఖర్ కుటుంబాన్నీ పరామర్శించడానికి కదిలి వస్తున్న ఎమ్మార్పీఎస్ దండు *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 22 : షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామాన్ని సోమవారం ఎమ్మార్పీఎస్ అధినేత, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సందర్శించనున్నారు. ఇటీవలే కుల దృహంకార హత్యకు గురైన ఎల్లంపల్లి గ్రామానికి చెందిన దళితుడు ఎర్ర రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన వస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నరసింహ మాదిగ తెలిపారు. కుల దృహంకార హత్యకు గురై అసువులు బాసిన ఎర్ర రాజశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా పూర్తిస్థాయి న్యాయం జరిగి అదే విధంగా అంతకులకు కఠిన శిక్ష పడేందుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కార్యాచరణలో భాగంగా గ్రామాన్ని సందర్శించి ఎర్ర రాజశేఖర్ భార్య వాణి అదేవిధంగా తండ్రి మల్లేష్ తదితరు కుటుంబ సభ్యులను ఆయన స్వయంగా పరామర్శిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ హత్య కేసులో పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. కేసు విచారణ కొనసాగుతోంది. ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా తీర రాజశేఖర్ కుటుంబాన్ని సందర్శించి పరామర్శించింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ద్వారా నాలుగు లక్షల 12 వేల రూపాయల చెక్కును అందజేసింది. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. కుటుంబ ఖర్చుల నిమిత్తం తన సొంతంగా 50వేల రూపాయలు అందజేశారు. ఇంకా ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున రాజశేఖర్ కుటుంబానికి అండగా నిలిచాయి. ఈ నేపథ్యంలో మందకృష్ణ మాదిగ రాక సందర్భంగా మరోసారి ఎల్లంపల్లి గ్రామం వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా ఎమ్మార్పీఎస్ దండు ఎల్లంపల్లి గ్రామానికి కదిలి వస్తుంది

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 22 : షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామాన్ని సోమవారం ఎమ్మార్పీఎస్ అధినేత, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సందర్శించనున్నారు. ఇటీవలే కుల దృహంకార హత్యకు గురైన ఎల్లంపల్లి గ్రామానికి చెందిన దళితుడు ఎర్ర రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన వస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నరసింహ మాదిగ తెలిపారు. కుల దృహంకార హత్యకు గురై అసువులు బాసిన ఎర్ర రాజశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా పూర్తిస్థాయి న్యాయం జరిగి అదే విధంగా అంతకులకు కఠిన శిక్ష పడేందుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కార్యాచరణలో భాగంగా గ్రామాన్ని సందర్శించి ఎర్ర రాజశేఖర్ భార్య వాణి అదేవిధంగా తండ్రి మల్లేష్ తదితరు కుటుంబ సభ్యులను ఆయన స్వయంగా పరామర్శిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ హత్య కేసులో పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. కేసు విచారణ కొనసాగుతోంది. ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా తీర రాజశేఖర్ కుటుంబాన్ని సందర్శించి పరామర్శించింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ద్వారా నాలుగు లక్షల 12 వేల రూపాయల చెక్కును అందజేసింది. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. కుటుంబ ఖర్చుల నిమిత్తం తన సొంతంగా 50వేల రూపాయలు అందజేశారు. ఇంకా ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున రాజశేఖర్ కుటుంబానికి అండగా నిలిచాయి. ఈ నేపథ్యంలో మందకృష్ణ మాదిగ రాక సందర్భంగా మరోసారి ఎల్లంపల్లి గ్రామం వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా ఎమ్మార్పీఎస్ దండు ఎల్లంపల్లి గ్రామానికి కదిలి వస్తుంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.