నవంబర్ 3 పున్నమి
రంగారెడ్డి జిల్లా తాండూరు బస్ డిపోకు చెందిన బస్సును సోమవారం కంకర ట్రక్కు ఢీకొట్టడంతో 24 మంది ప్రయాణికులు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
చేవెళ్ల మండలం మీర్జాగూడ గ్రామ సమీపంలో ఈ సంఘటన జరిగింది, కంకర లోడ్ తో వెళ్తున్న టిప్పర్ తాండూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.
దీంతో12 మంది పురుషులు, 11 మంది మహిళలు, ఒక చిన్నారి సహా 24 మంది మరణించారు.
తాండూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సు డ్రైవర్ కూడా మృతుల్లో ఉన్నాడు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.బస్సులో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నారని, వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారని అధికారులు తెలిపారు.
గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బస్సుపై కంకర పడటంతో, అనేక మంది ప్రయాణికులు వాహనం లోపలచిక్కుకుపోయారు.
గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
సహాయక చర్యల సమయంలో, చేవెళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ భూపాల్ శ్రీధర్ పై ఒక JCB ఎక్కి ఎడమ కాలుకు తీవ్ర గాయమైంది.
CI ని చికిత్స కోసం చేవెళ్ల ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదం కారణంగా హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి…
ప్రమాదవస్థలానికి వచ్చిన చేవెళ్లే ఎమ్మెల్యే …
ఎమ్మెల్యే నాలుగు గంటలైన ప్రమాద స్థలానికి రాకపోవడంతో ప్రజల తీవ్ర ఆగ్రహం… సంఘటన స్థలం నుండి ఎమ్మెల్యేని పంపించిన పోలీసులు..

రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాద ఘటన లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం….*.
నవంబర్ 3 పున్నమి రంగారెడ్డి జిల్లా తాండూరు బస్ డిపోకు చెందిన బస్సును సోమవారం కంకర ట్రక్కు ఢీకొట్టడంతో 24 మంది ప్రయాణికులు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ గ్రామ సమీపంలో ఈ సంఘటన జరిగింది, కంకర లోడ్ తో వెళ్తున్న టిప్పర్ తాండూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో12 మంది పురుషులు, 11 మంది మహిళలు, ఒక చిన్నారి సహా 24 మంది మరణించారు. తాండూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సు డ్రైవర్ కూడా మృతుల్లో ఉన్నాడు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.బస్సులో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నారని, వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సుపై కంకర పడటంతో, అనేక మంది ప్రయాణికులు వాహనం లోపలచిక్కుకుపోయారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల సమయంలో, చేవెళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ భూపాల్ శ్రీధర్ పై ఒక JCB ఎక్కి ఎడమ కాలుకు తీవ్ర గాయమైంది. CI ని చికిత్స కోసం చేవెళ్ల ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదం కారణంగా హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి… ప్రమాదవస్థలానికి వచ్చిన చేవెళ్లే ఎమ్మెల్యే … ఎమ్మెల్యే నాలుగు గంటలైన ప్రమాద స్థలానికి రాకపోవడంతో ప్రజల తీవ్ర ఆగ్రహం… సంఘటన స్థలం నుండి ఎమ్మెల్యేని పంపించిన పోలీసులు..

