మొంథా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, వరి పంట రైతులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని వ్యవసాయ శాఖ సూచించింది. పాలు పోసుకునే దశలో ఉన్న స్వర్ణ, సంపద స్వర్ణ, బి.పి.టి 5204, ఆర్.ఎన్.ఆర్ 15048, కె.యన్.ఎం 1638 వంటి రకాలలో వర్షాలు వలన చేలు పడిపోతే, పొలంలో నీటిని అంతర్గత కాలువల ద్వారా తొలగించాలి. నీరు ఎక్కువగా నిలిచిన చోట పెద్ద కాలువలు తవ్వి, మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపించాలి. పడిపోయిన చేలను అవకాశం ఉన్నంతవరకు పైకి లేపి కట్టుకోవాలి. నిలబడి ఉన్న మరియు పడిపోయిన చేలలో గింజల రంగు మారటం, మాగుడు తెగులు మరియు మానిపండు తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున, ఎకరాకు 200 మిల్లీ లీటర్ల ప్రోపికోనాజోల్ పిచికారీ చేయాలని సూచించారు. ఈ చర్యలు పంటను రక్షించడమే కాకుండా దిగుబడి నష్టాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.

మొంథా తుఫాను నేపథ్యంలో వరి పంట రైతులు తీసుకోవలసిన కీలక జాగ్రత్తలు
మొంథా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, వరి పంట రైతులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని వ్యవసాయ శాఖ సూచించింది. పాలు పోసుకునే దశలో ఉన్న స్వర్ణ, సంపద స్వర్ణ, బి.పి.టి 5204, ఆర్.ఎన్.ఆర్ 15048, కె.యన్.ఎం 1638 వంటి రకాలలో వర్షాలు వలన చేలు పడిపోతే, పొలంలో నీటిని అంతర్గత కాలువల ద్వారా తొలగించాలి. నీరు ఎక్కువగా నిలిచిన చోట పెద్ద కాలువలు తవ్వి, మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపించాలి. పడిపోయిన చేలను అవకాశం ఉన్నంతవరకు పైకి లేపి కట్టుకోవాలి. నిలబడి ఉన్న మరియు పడిపోయిన చేలలో గింజల రంగు మారటం, మాగుడు తెగులు మరియు మానిపండు తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున, ఎకరాకు 200 మిల్లీ లీటర్ల ప్రోపికోనాజోల్ పిచికారీ చేయాలని సూచించారు. ఈ చర్యలు పంటను రక్షించడమే కాకుండా దిగుబడి నష్టాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.

