ములుగు జిల్లాలో యువకుడి దారుణ హత్య
ములుగు జిల్లా మండలం లాలాయగూడెంలో జాడి సమ్మయ్య అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు అతన్ని కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది వివరాల్లోకెళ్తే ఏటూర్ నగరం మండల కేంద్ర లో జాడి సమ్మయ్య (40) మండల కేంద్రంలోని ఎలక్ట్రిషన్ గా పనిచేస్తు జీవనం గడుపుతున్నాడు అతనికి వివాహం కాగా భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు గత కొద్దికాలంలో లాలాయిగూడెం చెందిన ఒక మైనర్ బాలిక( 16) తో వివాహేతర సంబంధం పెట్టుకొని మద్యానికి బానిస అయ్యాడని సమాచారం గత కొద్దిరోజుల క్రితం సమ్మయ్య తండ్రి సైతం గొడవలు అవుతున్నాయని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం ఈ క్రమంలో సమ్మయ్య ఆదివారం సాయంకాలం టీఎస్ 25766 నెంబర్ గల ద్విచక్ర హోండా వాహనం లాలాయి గూడెం లో ఉన్న మైనర్ బాలిక తల్లిదండ్రులు సమ్మయ్య ను గ్రామంలో ఉన్న ఒక విద్యుత్ స్తంభానికి కట్టేసి విపరీతంగా కొట్టగా ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది


