శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 11: శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పవిత్ర ఉత్సవాల సందర్భంగా ముక్కంటి ఆలయానికి ఏర్పేడు మండల మాజీ అధ్యక్షుడు నైనారు పొన్నారావు సౌజన్యంతో భక్తుల సౌకర్యార్థం బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయానికి వచ్చే మహిళా భక్తులకు అమ్మవారి ప్రసాదంతో పాటు గాజులు, పసుపు, కుంకుమలను పంపిణీ చేసే సంప్రదాయంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషీతా రెడ్డి చేతులమీదుగా ఆలయ కార్యనిర్వహణాధికారి టి. బాపిరెడ్డికి ఈ విరాళం అందజేశారు. ఈ సందర్భంగా బొజ్జల రిషీతా రెడ్డి మాట్లాడుతూ…లోకకల్యాణం కోసం జరిగే ఈ మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగస్వాములు కావడం చాల సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈవో బాపిరెడ్డి ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ధ్వజారోహణంతో ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో రిషీతా రెడ్డితో పాటు నైనారు పొన్నారావు, ఆలయ అధికారులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ముక్కంటి ఆలయానికి గాజుల వితరణ
శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 11: శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పవిత్ర ఉత్సవాల సందర్భంగా ముక్కంటి ఆలయానికి ఏర్పేడు మండల మాజీ అధ్యక్షుడు నైనారు పొన్నారావు సౌజన్యంతో భక్తుల సౌకర్యార్థం బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయానికి వచ్చే మహిళా భక్తులకు అమ్మవారి ప్రసాదంతో పాటు గాజులు, పసుపు, కుంకుమలను పంపిణీ చేసే సంప్రదాయంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషీతా రెడ్డి చేతులమీదుగా ఆలయ కార్యనిర్వహణాధికారి టి. బాపిరెడ్డికి ఈ విరాళం అందజేశారు. ఈ సందర్భంగా బొజ్జల రిషీతా రెడ్డి మాట్లాడుతూ…లోకకల్యాణం కోసం జరిగే ఈ మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగస్వాములు కావడం చాల సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈవో బాపిరెడ్డి ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ధ్వజారోహణంతో ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో రిషీతా రెడ్డితో పాటు నైనారు పొన్నారావు, ఆలయ అధికారులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

