*మిరియాల సేవలు అజరామరం*
*ఘనంగా 86వ జయంతి వేడుకలు*
*పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రముఖులు*
*ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు*
*విశాఖపట్నం డిసెంబర్ 14 పున్నమి ప్రతినిధి*
మహోన్నత వ్యక్తిగా.. ప్రజా సమస్యలు పరిష్కరించే ఉద్యమ నాయకుడిగా తనదైన రీతిలో చెరగని ముద్ర వేసుకున్న మిరియాల వెంకటరావు సమాజానికి అందించిన సేవలు అజరామరం అనీ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు.. వంశీకృష్ణ శ్రీనివాస్ లు కొనియాడారు ..ఆదివారం. ఇక్కడ వి ఎం ఆర్ డి ఏ బాలల ప్రాంగణంలో మిరియాల వెంకటరావు 86వ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ మిరియాల వెంకటరావు ఉన్నతమైన ఆశయాలతో ప్రజా జీవితాన్ని కొనసాగించారన్నారు.. చివరి వరకు ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలనే సంకల్పంతోనే మిరియాల ఫౌండేషన్ ఏర్పాటు చేసి ముందుకు సాగారన్నారు.. అనేక యూనియన్లకు ..సంఘాలకు ప్రాతినిధ్యం వహించి అందరికోసం పాటుపడేవారన్నారు. సమాజంతో పాటు కాపులకు ఎనలేని సేవలు అందించారన్నారు.. అలాగే ఎంతోమందికి మార్గదర్శకులుగా నిలిచారన్నారు.. సభలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు
తమ్మిరెడ్డి శివశంకర్(ఎ పి ఎం ఎస్ ఇ చైర్మన్)..బొలిశెట్టి సత్యనారాయణ లు మాట్లాడుతూ కాపుల అభ్యున్నతికి మిరియాల వెంకటరావు ఎంతగానో తోడ్పాటు అందించారన్నారు.. తన వద్దకు వచ్చే వారి విషయంలో ప్రతి సందర్భంలోనూ అయిన దిశ నిర్దిష చేయడంతో పాటు సమాజానికి మన వంతు సహకారం అందించే ప్రయత్నం చేయాలని చెప్పేవారన్నారు.. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వీరు పిలుపునిచ్చారు . మిరియాల పౌండేషన్ ట్రస్ట్ సభ్యులు. కఠారి అప్పారావు మురళి కోట
పోతల శ్రీనివాస్ 86 వ. జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు డిసిసిబి చైర్మన్ కోన తాతారావు భీమిలి టిడిపి నాయకులు గంటా రవితేజ.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు.. మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ .కార్పొరేటర్లు ఉషశ్రీ. పివి సురేష్. డాక్ యార్డ్ సంఘము అధ్యక్షులు బత్తుల చిరంజీవి కార్యదర్శి విజనగిరి భాస్కరరావు.
కాపు సంఘాల నాయకులు.. గుంటూరు నరసింహ మూర్తి.. తోట రాజీవ్..బి ఎన్ మూర్తి…. సేనాపతి వెంకటేశ్.. సుబ్బు విశ్వనాథ్ తో పాటు పెద్ద ఎత్తున పలు సంఘాల నాయకులు మిరియాల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.


