శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 11: శ్రీకాళహస్తి మండలంలోని బొక్కిసం పాలెం గ్రామం కేంద్ర మహిళ స్నేహపూర్వక పంచాయతీగా ఎంపికలో ఉంది. అందులో భాగంగా గురువారం నాడు కేంద్రం నుండి ప్రత్యేక బృందం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జిల్లా అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు పంచాయతీని సందర్శించి మహిళలు చేస్తున్న అభివృద్ధిని పరిశీలించారు. అంగన్వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో న్యూట్రిషన్ ఫుడ్ స్టాల్స్, ఆర్గానిక్ పద్ధతిలో పండించిన కూరగాయల స్టాల్స్ ఏర్పాటు చేశారు. కేంద్రం నుండి వచ్చిన అధికారులను సర్పంచ్ రేఖ దుశ్యాలువాలతో సన్మానించారు. ఈ సందర్బంగా కేంద్ర బృందం మాట్లాడుతూ…పంచాయతీని మహిళలు చాలా అభివృద్ధి చేస్తున్నారని త్వరలోనే పంచాయతీ అభివృద్ధికి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కె. సుబ్రహ్మణ్యం, ముని రెడ్డి, మహిళా సంఘాలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మహిళల అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర బృందం ప్రశంసలు
శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 11: శ్రీకాళహస్తి మండలంలోని బొక్కిసం పాలెం గ్రామం కేంద్ర మహిళ స్నేహపూర్వక పంచాయతీగా ఎంపికలో ఉంది. అందులో భాగంగా గురువారం నాడు కేంద్రం నుండి ప్రత్యేక బృందం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జిల్లా అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు పంచాయతీని సందర్శించి మహిళలు చేస్తున్న అభివృద్ధిని పరిశీలించారు. అంగన్వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో న్యూట్రిషన్ ఫుడ్ స్టాల్స్, ఆర్గానిక్ పద్ధతిలో పండించిన కూరగాయల స్టాల్స్ ఏర్పాటు చేశారు. కేంద్రం నుండి వచ్చిన అధికారులను సర్పంచ్ రేఖ దుశ్యాలువాలతో సన్మానించారు. ఈ సందర్బంగా కేంద్ర బృందం మాట్లాడుతూ…పంచాయతీని మహిళలు చాలా అభివృద్ధి చేస్తున్నారని త్వరలోనే పంచాయతీ అభివృద్ధికి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కె. సుబ్రహ్మణ్యం, ముని రెడ్డి, మహిళా సంఘాలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

