Saturday, 14 February 2026
  • Home  
  • మహాదేవునికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించిన మంత్రి ఆనం
- తిరుపతి

మహాదేవునికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించిన మంత్రి ఆనం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 14: శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. బ్రహ్మోత్సవాల ఐదో రోజున జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కలిసి సంప్రదాయబద్ధంగా మంగళవాయిద్యాల నడుమ పట్టువస్త్రాలను తలపై మోస్తూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు, వేద పండితులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద మొక్కులు తీర్చుకుని, గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆశీర్వచన మండపంలో పండితులు మంత్రికి వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో శ్రీకాళహస్తికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. “మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించామని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ…ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లు, తాగునీరు, అన్నదానం, ఉచిత ప్రసాదం పంపిణీకి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే పరకొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టేసాయి ప్రసాద్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ, ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ కుమార్, బోర్డు సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 14: శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. బ్రహ్మోత్సవాల ఐదో రోజున జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కలిసి సంప్రదాయబద్ధంగా మంగళవాయిద్యాల నడుమ పట్టువస్త్రాలను తలపై మోస్తూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు, వేద పండితులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద మొక్కులు తీర్చుకుని, గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆశీర్వచన మండపంలో పండితులు మంత్రికి వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో శ్రీకాళహస్తికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. “మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించామని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ…ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లు, తాగునీరు, అన్నదానం, ఉచిత ప్రసాదం పంపిణీకి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే పరకొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టేసాయి ప్రసాద్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ, ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ కుమార్, బోర్డు సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.