విశాఖపట్నం, అక్టోబర్ 22 (పున్నమి ప్రతినిధి)
అగనంపూడి కొండయ్య వలస గ్రామ శ్రీ సీతారామాలయం ప్రాంగణంలో గత ప్రభుత్వం హాయంలో ఇల్లపు వరలక్ష్మి ప్రసాద్ 20 లక్షల జిఎంసి నిధులతో మల్టీపర్సహాలు నిర్మాణ పనులు ప్రారంభించాక ఆ పనులు అసంతృప్తితో ఉండిపోవడంతో రెండో విడత ఇల్లపు వరలక్ష్మి ప్రసాద్ గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు సహకారంతో మరో 29 లక్షల నిధులు జీవిఎంసీ మంజూరు చేయగా మల్టీపర్పస్ హాలు అసంతృప్తి నిర్మాణ పనులు వరలక్ష్మి ప్రసాద్ ప్రారంభించారు. కార్పొరేటర్ దంపతులను కొండయ్య వలస గ్రామ ప్రజలు సన్మానం చేసి హర్షం వ్యక్తపరిచారు. 85 వార్డు తెలుగు యువత అధ్యక్షులు బండారు చందు రమేష్ సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ, జనసేన పార్టీ నాయకులు విందుల వెంకటరమణ, టిడిపి నాయకులు వడ్డాది శ్రీనివాసరావు, బిజెపి నాయకులు కోసూరి తాతారావు ఏరియా ఆసుపత్రి కమిటీ సభ్యులు డొక్కా రమేష్ గ్రామ పెద్దలు బలిరెడ్డి శ్రీను, విందుల వరహాలు, సాయిన సన్యాసిరావు, బోండా ఈశ్వరరావు, డాక్టరేట్ గుదే సుశీల గజేంద్ర, తిలక్ కూటమి మహిళా నాయకురాలు మేడిశెట్టి పద్మ, యు గీత, అన్నపూర్ణ, రావాడ శిరీష మరియు కొండయ్య వలస గ్రామ పుర ప్రజలు పాల్గొన్నారు.

