పున్నమి న్యూస్ ప్రతినిధి
23 ఫిబ్రవరి 2026
అలంపల్లి దుర్గేష్
9640204826
మల్కాజ్గిరి MMC నూతన కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన — మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి
తార్నాక పాత HMDA కార్యాలయంలో ఏర్పాటు చేసిన MMC కమిషనర్ కార్యాలయంలో మల్కాజ్గిరి నూతన కమిషనర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి (IAS) * మర్యాదపూర్వకంగా మాజీ GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి కలసి మొక్కను అందజేసి వారికి శుభాభివందనాలు తెలియజేసి, అనంతరం డివిజన్లోని కొనసాగే పనులను మరియు సమస్యలను వారితో చర్చించడం జరిగింది.
ఈ సందర్భంగా నర్సింహ్మా రెడ్డి మాట్లాడుతూ….
మన్సూరాబాద్ సహారా ఎస్టేట్స్ రోడ్డు నుండి కామినేని హాస్పిటల్ వెళ్లే మార్గం రోజు రద్దీగా ఉండడంతో రోజు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ఉప్పల్,నాగోల్,ఎల్బీనగర్ నుండి ఇటువైపుగా చాలా వాహనాలు వెళ్లడంతో జంక్షన్ ఇంప్రూవ్మెంట్ తో పాటు 100 ఫీట్ల రోడ్డును తొందరగా నిర్మించే ప్రయత్నం చేయాలని దానికి సంబంధించిన అన్ని ఎస్టిమేషన్స్ సిద్ధంగా ఉన్నాయని కమిషనర్ తెలియజేశారు.
హయత్ నగర్ బొమ్మల గుడి రోడ్ నుండి డబల్ బెడ్ రూమ్ వర్క్ ఉన్న దాదాపు 20 కాలనీలకు అనుసంధానంగా ఉండే రోడ్డు రూ: 2.00 కోట్ల నిధులతో సాంక్షన్ కావడం జరిగిందని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన ఇంకా పనులు మొదలు కాలేదని తెలియజేయడంతో మరో రెండు, మూడు రోజుల్లో రోడ్ పనులు ప్రారంభిస్తారని తెలియజేశారు.
దాదాపు రూ: 10.00కోట్ల నిధులతో టెండర్ ప్రక్రియ పూర్తయి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఇంకా పెండింగ్లో ఉన్న పనులను తొందరగా ప్రారంభించాలని, ఇంకా డివిజన్లోని కొనసాగే పనులు మరియు సమస్యలను MMC కమిషనర్ తెలియజేయడంతో వారు సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారాన్ని తెలియజేసి తొందర్లోనే పనులు ప్రారంభిస్తారని శుభవార్తను తెలియజేశారు.





