ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు, మాజీ టిటిడి బోర్డు ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డిని చిత్తూరు జిల్లా వైసీపీ ఉపాద్యాయ విభాగం నూతన అధ్యక్షులు ఎన్.సోమచంద్రారెడ్డి కలసి దూశాలువలతో సత్కరించారు. తిరుపతిలో మంగళవారం జిల్లా స్థాయి వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు,ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం జరిగింది. నూతన చిత్తూరు జిల్లా ఉపాద్యాయ విభాగంలో జిల్లా అధ్యక్షులుగా చోటు కల్పించి నందులకు భూమనకు ఎన్.సోమచంద్రారెడ్డి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు.విద్యా ఉపాద్యాయ విభాగంతో పాటు పార్టీకి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని,అంతేగాక అవసరమైన సూచనలు సలహాలు పార్టీకీ అందిస్తానని భూమనకు తెలిపారు.జిల్లా ఉపాద్యాయ విభాగం భాధ్యతలు అప్పగించినందులకు రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడా లకు కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానన్నారు.జిల్లా,రాష్ట్ర స్థాయిలలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఓ ఉపాధ్యాయ సంఘానికి మూడు దశాబ్దాలుగా విశిష్ట సేవలు అందిoచిన ఎన్.సోమచంద్రారెడ్డి పదవీ విరమణ చెందినా ఉద్యోగ ఉపాద్యాయ పెన్షనర్ ల కోసం సర్వీసు సెంటర్ ను పలమనేరు లో నడుపుతూ ప్రత్యేక గుర్తింపు పొందారు.కాగా భూమనను సత్కరించిన సందర్భంలో జిల్లా క్రిస్టియన్ విభాగం అధ్యక్షులు రూబన్ కూడా వున్నారు.


