ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఇప్పటికీ ఇళ్ల స్థలాలు కేటాయించని బుదాన్ నిర్వాసితులకు అండగా భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చింది. రాష్ట్ర నాయకులు, కోశాధికారి శ్రీ దేవకి వాసుదేవరావు ఆధ్వర్యంలో వారి క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో, వెలుగుమట్లలో ఇళ్ల స్థలాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇల్ల స్థలాలు మరియు ఇల్లు కేటాయించే వరకు బీజేపీ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు నగిరికంటి వీరభద్రం, రాష్ట్ర నాయకులు సన్నే ఉదయ్ ప్రతాప్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాస్, సీనియర్ నాయకులు వక్కలంక సుబ్రహ్మణ్యం, డోగుపర్తి రవీందర్, మార్తి వీరభద్రప్రసాద్, రుద్ర ప్రదీప్, బోయినపల్లి చంద్రశేఖర్, నల్ల మాస శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్ కందుల శ్రీకృష్ణ, రమేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే అర్బన్ మండల ప్రధాన కార్యదర్శి ఆచంటి కోటేశ్వరరావు, శ్రీ రామ్, ఖమ్మం రెండో పట్టణ ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవ్తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


