Wednesday, 11 February 2026
  • Home  
  • బీసీల సింహ గర్జన గోడపత్రిక ఆవిష్కరణ
- తిరుపతి

బీసీల సింహ గర్జన గోడపత్రిక ఆవిష్కరణ

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 09: శ్రీకాళహస్తి స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో సోమవారం నాడు బీసీవై పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి బీసీల సింహ గర్జన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హిమబిందు మాట్లాడుతూ. ఈ నెల 22వ తేదీన విజయవాడ వేదికగా జరిగే బీసీల సింహగర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీసీవై పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ హిమబిందు పిలుపునిచ్చారు. స్వాతంత్రం సిద్ధించి 79 ఏళ్ళు గడుస్తున్నా బీసీలు ఇప్పటికీ రాజ్యాధికారానికి ఆమడ దూరంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీలది అదే పరిస్థితని బడుగుల్లో ఐక్యత లేకపోవడం వల్లే అగ్రవర్ణాలు నానాటికీ అణచివేతకు గురి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బడుగులు మేల్కొని రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని సింహ గర్జన-చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వంకా రమణయ్య, రామచంద్రయ్య, ఈశ్వర్, సునీల్, సురేష్, రఘు, గురవయ్య, బాలకృష్ణ, రామయ్య, మురగయ్య, చెంచయ్య, బత్తెయ్య తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 09: శ్రీకాళహస్తి స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో సోమవారం నాడు బీసీవై పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి బీసీల సింహ గర్జన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హిమబిందు మాట్లాడుతూ. ఈ నెల 22వ తేదీన విజయవాడ వేదికగా జరిగే బీసీల సింహగర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీసీవై పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ హిమబిందు పిలుపునిచ్చారు. స్వాతంత్రం సిద్ధించి 79 ఏళ్ళు గడుస్తున్నా బీసీలు ఇప్పటికీ రాజ్యాధికారానికి ఆమడ దూరంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీలది అదే పరిస్థితని బడుగుల్లో ఐక్యత లేకపోవడం వల్లే అగ్రవర్ణాలు నానాటికీ అణచివేతకు గురి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బడుగులు మేల్కొని రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని సింహ గర్జన-చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వంకా రమణయ్య, రామచంద్రయ్య, ఈశ్వర్, సునీల్, సురేష్, రఘు, గురవయ్య, బాలకృష్ణ, రామయ్య, మురగయ్య, చెంచయ్య, బత్తెయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.