ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి )
తెలంగాణ లో అధికార కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ ముసుగులో మత పరమైన రిజర్వేషన్ లని ప్రవేశ పెట్టేందుకు కుట్ర చేస్తుంది అని భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు విమర్శించారు. బుధవారం ఖమ్మం జిల్లా బిజెపి కార్యాలయం లో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశం లో నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ బిసి లకి 42% రిజర్వేషన్ కల్పిస్తాం అని చెప్పి అందులో 10% ముస్లిం లకి వాటా ఇస్తుంది అని ఆరోపించారూ. అందువల్ల బిసి లకి అన్యాయం జరుగుతుంది అని అన్నారు.
ఈ సమావేశం లో బిజెపి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల కన్వీనర్ ఈ వి రమేష్, కిసాన్ మోర్చా నాయకులు టి రవీందర్, మహిళా మోర్చా నాయకురాలు శ్రీమతి పమ్మి అనిత, యువమోర్చా నాయకులు ప్రవీణ్, ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, జిల్లా నాయకులు కుమిలి శ్రీనివాస్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ యుగంధర్ నాయుడు, టూ టౌన్ ప్రధాన కార్యదర్శి రుద్ర గాని మాధవ్ తదితరులు పాల్గొన్నారు


