సింహాచలం సమీపంలోని కృష్ణాపురం గోశాలలో బుధవారం ప్రారంభమైన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ప్రకృతి ఆధారిత పంటలతో ఉచితంగా భోజనాలు వడ్డించారు. అధిక పోషకాలు కలిగిన ‘బహురూపి’ బియ్యంతో అన్నం, ‘కాలాబట్టి’ బియ్యంతో చేసిన బెల్లం పొంగలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘చింతలూరి సన్నాలు’తో పులిహోర, నవార బియ్యంతో పెరుగు అన్నం రుచికరంగా వడ్డించారు. గుమ్మడికాయ పులుసు, దొండకాయ, వంకాయ కూరలు భోజనాన్ని మరింత రుచికరంగా మార్చాయి. మొదటి రోజు 2 వేల మందికి భోజనం ఏర్పాటు చేయగా, ఇకపై రోజుకు 5 వేల మందికి వడ్డించేలా ఏర్పాట్లు చేశారు.

బహురూపి బియ్యంతో భోజనాలు – గోశాలలో ప్రత్యేక విందు
సింహాచలం సమీపంలోని కృష్ణాపురం గోశాలలో బుధవారం ప్రారంభమైన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ప్రకృతి ఆధారిత పంటలతో ఉచితంగా భోజనాలు వడ్డించారు. అధిక పోషకాలు కలిగిన ‘బహురూపి’ బియ్యంతో అన్నం, ‘కాలాబట్టి’ బియ్యంతో చేసిన బెల్లం పొంగలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘చింతలూరి సన్నాలు’తో పులిహోర, నవార బియ్యంతో పెరుగు అన్నం రుచికరంగా వడ్డించారు. గుమ్మడికాయ పులుసు, దొండకాయ, వంకాయ కూరలు భోజనాన్ని మరింత రుచికరంగా మార్చాయి. మొదటి రోజు 2 వేల మందికి భోజనం ఏర్పాటు చేయగా, ఇకపై రోజుకు 5 వేల మందికి వడ్డించేలా ఏర్పాట్లు చేశారు.

