పున్నమి: అక్టోబర్ 24 రంగారెడ్డి జిల్లా: జాతీయ స్థాయి ఛాలెంజర్ కప్లో మెరిసిన మాస్టర్ షోటోకాన్ కరాటే డూ ఇండియా విద్యార్థులు హైదరాబాద్ లో శుక్రవారం రోజున భీష్మ రాజ్ ఫౌండేషన్ కార్యాలయం కాశీనాథేశ్వర కాలనీ శాంసన్ పల్లి రోడ్లో జాతీయ స్థాయి 22వ ఛాలెంజర్ కప్ 2025 కరాటే పోటీ విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది,ఈ సందర్భంగా ప్రముఖ సామాజిక కార్యకర్త,భీష్మ రాజ్ ఫౌండేషన్ చైర్మన్ డా కే రాజ్ కుమార్ రెడ్డి విజేత విద్యార్థులకు మెడల్స్ బహుకరించి అభినందించారు, మాస్టర్ షోటోకాన్ కరాటే డూ ఇండియా విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకున్నారు, ఈ పోటీల్లో స్రవంతి,బృంధా,మహేశ్వరి, అభిరామ్ బంగారు పతకాలు గెలుచుకోగా, బవేష్ రజత పతకం,కార్తీక్ కాంస్య పతకం సాధించి తమ కోచ్లకు, తల్లిదండ్రులకు గర్వకారణమయ్యారు, ఈ విజయానికి మార్గదర్శకులుగా కేశవ్ మాస్టర్ కరాటే అకాడమీ అశోక్ మాస్టర్ నారాయణపేట కీలక పాత్ర పోషించారు,ఈ సందర్భంగా డా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు పిల్లల వ్యక్తిత్వ వికాసానికి పునాది వేస్తాయి, ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం ఫౌండేషన్ గర్వకారణం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్రాజ్,అశోక్, మహేష్ వంటి సీనియర్ బ్లాక్ బెల్ట్ మాస్టర్లు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

బహుమతులు ప్రధానం చేసిన : భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డా కే రాజ్ కుమార్ రెడ్డి
పున్నమి: అక్టోబర్ 24 రంగారెడ్డి జిల్లా: జాతీయ స్థాయి ఛాలెంజర్ కప్లో మెరిసిన మాస్టర్ షోటోకాన్ కరాటే డూ ఇండియా విద్యార్థులు హైదరాబాద్ లో శుక్రవారం రోజున భీష్మ రాజ్ ఫౌండేషన్ కార్యాలయం కాశీనాథేశ్వర కాలనీ శాంసన్ పల్లి రోడ్లో జాతీయ స్థాయి 22వ ఛాలెంజర్ కప్ 2025 కరాటే పోటీ విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది,ఈ సందర్భంగా ప్రముఖ సామాజిక కార్యకర్త,భీష్మ రాజ్ ఫౌండేషన్ చైర్మన్ డా కే రాజ్ కుమార్ రెడ్డి విజేత విద్యార్థులకు మెడల్స్ బహుకరించి అభినందించారు, మాస్టర్ షోటోకాన్ కరాటే డూ ఇండియా విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకున్నారు, ఈ పోటీల్లో స్రవంతి,బృంధా,మహేశ్వరి, అభిరామ్ బంగారు పతకాలు గెలుచుకోగా, బవేష్ రజత పతకం,కార్తీక్ కాంస్య పతకం సాధించి తమ కోచ్లకు, తల్లిదండ్రులకు గర్వకారణమయ్యారు, ఈ విజయానికి మార్గదర్శకులుగా కేశవ్ మాస్టర్ కరాటే అకాడమీ అశోక్ మాస్టర్ నారాయణపేట కీలక పాత్ర పోషించారు,ఈ సందర్భంగా డా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు పిల్లల వ్యక్తిత్వ వికాసానికి పునాది వేస్తాయి, ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం ఫౌండేషన్ గర్వకారణం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్రాజ్,అశోక్, మహేష్ వంటి సీనియర్ బ్లాక్ బెల్ట్ మాస్టర్లు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

