రైల్వే కోడూరు మండలం మాధవరం పొడు గ్రామానికి చెందిన శంకర్వల్లి కుశల్ రాజు గారు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ & కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి ముక్కా వరలక్ష్మి గారు బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. స్వీయ నిధుల ద్వారా రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించి, కుశల్ రాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ తోడుగా ఉండటం తమ కుటుంబ బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, స్థానిక టిడిపి నాయకులు పాల్గొని, ముక్కా వరలక్ష్మి గారి సహృదయతను కొనియాడారు.

ప్రమాద బాధితుడు కుశల్ రాజుకు రూ.1 లక్ష ఆర్థిక సహాయం – ముక్కా వరలక్ష్మి
రైల్వే కోడూరు మండలం మాధవరం పొడు గ్రామానికి చెందిన శంకర్వల్లి కుశల్ రాజు గారు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ & కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి ముక్కా వరలక్ష్మి గారు బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. స్వీయ నిధుల ద్వారా రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించి, కుశల్ రాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ తోడుగా ఉండటం తమ కుటుంబ బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, స్థానిక టిడిపి నాయకులు పాల్గొని, ముక్కా వరలక్ష్మి గారి సహృదయతను కొనియాడారు.

