పున్నమి ప్రతినిధి, రిపోర్టర్ రమణ, సెప్టెంబర్ 9: రామచంద్రపురం మండలం హసన్ బాద గ్రామ గ్రంథాలయ బిల్డింగ్లో డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన మంగళవారం జిల్లా సేవాపక్వాడ కార్యసాల నిర్వహించారు. ఈ సందర్భంగా మండల సేవాపక్వాడ కన్వీనర్ కో కన్వీనర్లతో వర్క్ షాప్ నిర్వహించారు.ఈ నెల 17 వ తేదీన ప్రధాని మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవాపక్వాడ్ 2025 పక్షోత్సవాలు గురించి నిర్వహించిన ఈ వర్క్షాప్ కి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు గారు మాట్లాడుతూ రానున్న ప్రధాని మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవ ద్వారా ప్రజలలో వారి జన్మదినాన్ని జరపాలని కార్యకర్తలకు సూచించారు. మోడీ ప్రవేశపెట్టిన వికసిత భారత్, ఆత్మ నిర్భర్ భారత్, డిజిటల్ ఇండియా గురించి ప్రజలకు తెలియజేయాలని అన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు,రామచంద్రపురం బిజెపి మండల అధ్యక్షులు ఆకేటి శ్రీ కృష్ణ,నియోజకవర్గ నాయకులు తదితరులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారిని ఘనంగా సత్కరించారు.అనంతరం సోము వీర్రాజు గారు మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా బిజెపి ఇంచార్జి కర్రి చిట్టిబాబు, రాష్ట్ర అధికార బిజెపి ప్రతినిధి నల్లా పవన్, పాలూరి సత్యానందం, జిల్లా ప్రధాన కార్యదర్శి సలాది వీరబాబు, కే.దత్తాత్రేయ,సి.ఎచ్. శ్రీనివాసరావు,గనిశెట్టి వెంకటేశ్వరరావు, నడీమ్పల్లి సుబ్బరాజు,రామచంద్రపురం నియోజకవర్గ బిజెపి మండల అధ్యక్షులు,అధిక సంఖ్యలో బిజెపి నాయకులు, కార్యకర్తలు,మహిళా బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


