శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళా రెడ్డి చేపట్టినటువంటి ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర రాష్ట్ర పర్యటనలో భాగంగా శనివారం నాడు అమలాపురం జిల్లా పాయకారావుపేట నియోజకవర్గంలోని వెధర్లపాలెం గ్రామంలో కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ఈ సందర్భంగా దామోదరం రెడ్డి మాట్లాడుతూ….ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో వైఎస్ షర్మిలా రెడ్డి చేపట్టిన యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తున్నదని ప్రజల తరఫున జరుగుతున్న ఈ పోరాట ఫలితంగానే ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలను మరో రెండు నెలలపాటు వాయిదా వేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారని, వైఎస్ షర్మిలా రెడ్డి నిర్వహిస్తున్న సభలకు అశేష జనవాహిని తండోపతండాలుగా తరలివస్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ప్రజల కోసమే వైఎస్ షర్మిళా రెడ్డి యాత్ర – తలపా దామోదరం రెడ్డి
శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళా రెడ్డి చేపట్టినటువంటి ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర రాష్ట్ర పర్యటనలో భాగంగా శనివారం నాడు అమలాపురం జిల్లా పాయకారావుపేట నియోజకవర్గంలోని వెధర్లపాలెం గ్రామంలో కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ఈ సందర్భంగా దామోదరం రెడ్డి మాట్లాడుతూ….ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో వైఎస్ షర్మిలా రెడ్డి చేపట్టిన యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తున్నదని ప్రజల తరఫున జరుగుతున్న ఈ పోరాట ఫలితంగానే ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలను మరో రెండు నెలలపాటు వాయిదా వేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారని, వైఎస్ షర్మిలా రెడ్డి నిర్వహిస్తున్న సభలకు అశేష జనవాహిని తండోపతండాలుగా తరలివస్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

