ఇప్పటికి ఆరు దఫాలుగా పార్లమెంటు సభ్యుడు గా వ్యవహరించిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి తొలి సారిగా ప్యానెల్ స్పీకర్ గా వ్యవహరించారు. యమ్.పి.గా తన కంచు కంఠంతో వాగ్ధాటి తో పాలు ప్రజా సమస్యలను పార్లమెంటు దృష్టి కి తీసుకు రావడం లో ఆయన అందరి ప్రశంసలను ఇప్పటి వరకు అందుకున్నారు. అంతే కాకుండా ఇప్పటి వరకు ఆయన పార్లమెంటు చర్చల్లో ఎలాంటి వివాదాలలో కూడా లేక పోవడం విశేషం. మాగుంట ప్రశ్న వేసి ప్రసంగిస్తుంటే ప్రత్యర్థి పార్టీ నేతలు కూడా సర్దుబాటు ధోరణితో ఆయనకే అవకాశం కల్పించి చర్చకు ప్రాధాన్యత ఇస్తారు.అలాంటిది నేడు
ఒంగోలు పార్లమెంటు సభ్యులు గా మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం ప్యానల్ స్పీకర్ గా వ్యవహరించి పార్లమెంటు సమావేశాలను నిర్వహించారు. సీనియర్ పార్లమెంటేరియన్ అయిన మాగుంట ప్యానల్ స్పీకర్ గా వ్యవహరించడం ఇదే మొదటిసారి. ఈరోజు జరిగిన సమావేశాలను ఆయన శైలి లో ముసి ముసి నవ్వులతో సభను సజావు గా నడిపించారు. శీనన్న ప్యానెల్ స్పీకర్ గా వ్యవహరించిన తీరు ను నెల్లూరు,ప్రకాశం జిల్లాల్లోని ఆయన అభిమానులు ప్రత్యేకంగా ఫోన్లలో,టి.వి.లలో తిలకించారు.

ప్యానెల్ స్పీకర్ గా ఫస్ట్ టైం మాగుంట
ఇప్పటికి ఆరు దఫాలుగా పార్లమెంటు సభ్యుడు గా వ్యవహరించిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి తొలి సారిగా ప్యానెల్ స్పీకర్ గా వ్యవహరించారు. యమ్.పి.గా తన కంచు కంఠంతో వాగ్ధాటి తో పాలు ప్రజా సమస్యలను పార్లమెంటు దృష్టి కి తీసుకు రావడం లో ఆయన అందరి ప్రశంసలను ఇప్పటి వరకు అందుకున్నారు. అంతే కాకుండా ఇప్పటి వరకు ఆయన పార్లమెంటు చర్చల్లో ఎలాంటి వివాదాలలో కూడా లేక పోవడం విశేషం. మాగుంట ప్రశ్న వేసి ప్రసంగిస్తుంటే ప్రత్యర్థి పార్టీ నేతలు కూడా సర్దుబాటు ధోరణితో ఆయనకే అవకాశం కల్పించి చర్చకు ప్రాధాన్యత ఇస్తారు.అలాంటిది నేడు ఒంగోలు పార్లమెంటు సభ్యులు గా మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం ప్యానల్ స్పీకర్ గా వ్యవహరించి పార్లమెంటు సమావేశాలను నిర్వహించారు. సీనియర్ పార్లమెంటేరియన్ అయిన మాగుంట ప్యానల్ స్పీకర్ గా వ్యవహరించడం ఇదే మొదటిసారి. ఈరోజు జరిగిన సమావేశాలను ఆయన శైలి లో ముసి ముసి నవ్వులతో సభను సజావు గా నడిపించారు. శీనన్న ప్యానెల్ స్పీకర్ గా వ్యవహరించిన తీరు ను నెల్లూరు,ప్రకాశం జిల్లాల్లోని ఆయన అభిమానులు ప్రత్యేకంగా ఫోన్లలో,టి.వి.లలో తిలకించారు.

