17-07-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా మనుబోలుమండలం పోలీస్ స్టేషన్ నందు ఎస్సై తో సహా 11 మందికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయిన నేపథ్యంలో శుక్రవారం నాడు సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మనుబోలు మండల కేంద్రంలో పర్యటించి పోలీసులను అధైర్యపడవద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. స్థానిక పోలీస్ క్వార్టర్స్ నందు మాస్కులు , శానిటైజర్లు పంపిణీ చేశారు. విస్తృతంగా శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని , మెరుగైన సేవలు అందించాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూచెర్లోపల్లి వడ్లపూడి గ్రామంలో కూడా కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు రక్షణ కల్పిస్తూ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు కరోనా పాజిటివ్ విషయం తెలుసుకున్న తాను చాలా బాధపడ్డానని , చాలా దురదృష్టకరమన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కరోనా నివారణకు అన్ని రకాలుగా సమర్ధవంతమైన చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు.ఆయన వెంట తహశీల్దార్ నాగరాజు , ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ,వైద్యాధికారి సుబ్బరాజు మండల వైయస్ఆర్ సీపీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి ,కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ,దాసరి భాస్కర్ గౌడ్, దాసరి మహేంద్ర వర్మ ,అన్నమాల ప్రభాకర్ రెడ్డి,కిషోర్ నాయుడు ,గుంజి రమేష్ ,కోటేశ్వరరావు గౌడ్,చల్ల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు .
పోలీసులు అధైర్యపడవద్దు అండగా నేనున్నాను: శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి
17-07-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా మనుబోలుమండలం పోలీస్ స్టేషన్ నందు ఎస్సై తో సహా 11 మందికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయిన నేపథ్యంలో శుక్రవారం నాడు సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మనుబోలు మండల కేంద్రంలో పర్యటించి పోలీసులను అధైర్యపడవద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. స్థానిక పోలీస్ క్వార్టర్స్ నందు మాస్కులు , శానిటైజర్లు పంపిణీ చేశారు. విస్తృతంగా శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని , మెరుగైన సేవలు అందించాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూచెర్లోపల్లి వడ్లపూడి గ్రామంలో కూడా కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు రక్షణ కల్పిస్తూ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు కరోనా పాజిటివ్ విషయం తెలుసుకున్న తాను చాలా బాధపడ్డానని , చాలా దురదృష్టకరమన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కరోనా నివారణకు అన్ని రకాలుగా సమర్ధవంతమైన చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు.ఆయన వెంట తహశీల్దార్ నాగరాజు , ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ,వైద్యాధికారి సుబ్బరాజు మండల వైయస్ఆర్ సీపీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి ,కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ,దాసరి భాస్కర్ గౌడ్, దాసరి మహేంద్ర వర్మ ,అన్నమాల ప్రభాకర్ రెడ్డి,కిషోర్ నాయుడు ,గుంజి రమేష్ ,కోటేశ్వరరావు గౌడ్,చల్ల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు .