Friday, 13 February 2026
  • Home  
  • పేద కుటుంబానికి ఆసరాగ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్
- తిరుపతి

పేద కుటుంబానికి ఆసరాగ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 13: శ్రీకాళహస్తి తపాలా శాఖలో బీమా తీసుకోవడం వలన పేద కుటుంబాన్ని ఆదుకున్న సంఘటన చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి సబ్ డివిజన్ తపాలా శాఖ ఐపీఓ బాలాజీ కథనం వివరాలు అకస్మాత్తుగా పాలసీదారుడు మరణించడంతో ఓ పేద కుటుంబానికి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పిఎల్ఐ) ఆదుకుంది. శ్రీకాళహస్తి పట్టణంలోని బంగారమ్మ గుడి కాలనీకి చెందిన వి వెంకటాద్రి తపాలా శాఖలో జూలై 22వ సంవత్సరంలో 20 లక్షలు పాలసీ తీసుకున్నాడు. ఏడాదికి రూ. 1,28,040 చొప్పున రెండు సంవత్సరాలు రూ. 2,56,080 లక్షలు ప్రీమియం చెల్లించాడు. అయితే అతను అకస్మాత్తుగా మృతి చెందాడు. ఈ నేపథ్యంలో అతని భార్య పిల్లలు అయోమయ స్థితిలోకి వెళ్లిపోయారు. జీవనం గడవడం కూడా కష్టతరంగా మారింది. శ్రీకాళహస్తి సబ్ డివిజన్ తపాలా శాఖ ఐపీఓ బాలాజీ, శ్రీకాళహస్తి హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్మాస్టర్ రాంబాబు మృతిని భార్య అలేఖ్యకు శ్రీకాళహస్తి తపాలా శాఖ కార్యాలయంలో శుక్రవారం నాడు రూ. 23,02,001 లక్షల బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మృతుడు భార్య అలేఖ్య మాట్లాడుతూ.. తమ భర్త తపాలా శాఖలో పాలసీ వేయడం వలన నేడు తమ కుటుంబానికి ఎంతో ఆసరాగా తోడ్పడిందని ఆమె తెలిపారు. అనంతరం తపాలా శాఖ ఐపీఓ బాలాజీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తపాలా శాఖలో పి ఎల్ ఐ కానీ ఆర్ పి ఎల్ ఐ బీమా తీసుకోవడం వలన వారి కుటుంబానికి అండగా ఉంటుందని గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రజలు తమ గ్రామాల్లో ఉన్న బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో తమ సిబ్బందిని కలిస్తే పూర్తి సమాచారం అందిస్తారని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 13: శ్రీకాళహస్తి తపాలా శాఖలో బీమా తీసుకోవడం వలన పేద కుటుంబాన్ని ఆదుకున్న సంఘటన చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి సబ్ డివిజన్ తపాలా శాఖ ఐపీఓ బాలాజీ కథనం వివరాలు అకస్మాత్తుగా పాలసీదారుడు మరణించడంతో ఓ పేద కుటుంబానికి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పిఎల్ఐ) ఆదుకుంది. శ్రీకాళహస్తి పట్టణంలోని బంగారమ్మ గుడి కాలనీకి చెందిన వి వెంకటాద్రి తపాలా శాఖలో జూలై 22వ సంవత్సరంలో 20 లక్షలు పాలసీ తీసుకున్నాడు. ఏడాదికి రూ. 1,28,040 చొప్పున రెండు సంవత్సరాలు రూ. 2,56,080 లక్షలు ప్రీమియం చెల్లించాడు. అయితే అతను అకస్మాత్తుగా మృతి చెందాడు. ఈ నేపథ్యంలో అతని భార్య పిల్లలు అయోమయ స్థితిలోకి వెళ్లిపోయారు. జీవనం గడవడం కూడా కష్టతరంగా మారింది. శ్రీకాళహస్తి సబ్ డివిజన్ తపాలా శాఖ ఐపీఓ బాలాజీ, శ్రీకాళహస్తి హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్మాస్టర్ రాంబాబు మృతిని భార్య అలేఖ్యకు శ్రీకాళహస్తి తపాలా శాఖ కార్యాలయంలో శుక్రవారం నాడు రూ. 23,02,001 లక్షల బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మృతుడు భార్య అలేఖ్య మాట్లాడుతూ.. తమ భర్త తపాలా శాఖలో పాలసీ వేయడం వలన నేడు తమ కుటుంబానికి ఎంతో ఆసరాగా తోడ్పడిందని ఆమె తెలిపారు. అనంతరం తపాలా శాఖ ఐపీఓ బాలాజీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తపాలా శాఖలో పి ఎల్ ఐ కానీ ఆర్ పి ఎల్ ఐ బీమా తీసుకోవడం వలన వారి కుటుంబానికి అండగా ఉంటుందని గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రజలు తమ గ్రామాల్లో ఉన్న బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో తమ సిబ్బందిని కలిస్తే పూర్తి సమాచారం అందిస్తారని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.