కామారెడ్డి,22 సెప్టెంబర్ పున్నమి ప్రతినిధి. :
కామారెడ్డి జిల్లా, నర్సన్నపల్లిలో పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో 28 ఏళ్ల యువకుడు ధ్యాప మహేష్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. అతను గతంలో దుబాయ్లో పని చేసి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. తండ్రి సాయిలు పెళ్లి కోసం ప్రయత్నించగా ఏదీ ఫలితం ఇవ్వలేదు. గతంలో రెండు సార్లు ఆత్మహత్య యత్నం విఫలమైంది. ఆదివారం రాత్రి ఇంటి నుంచి వెళ్ళిన మహేష్ మళ్లీ రాలేదని తండ్రి వెతుకగా, రైలు పట్టాల వద్ద మృతదేహం కనుగొన్నారు. రైల్వే అధికారులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం కోసం జీజీఎచ్ కు తరలించారు. మహేష్ మృతితో కుటుంబం విషాదంలో మునిగింది; గ్రామస్థులు కుటుంబ బాధను పంచుకున్నారు.


