Sunday, 7 December 2025
  • Home  
  • నెల్లూరు ఎంఎల్ఏలు వర్సెస్ అధికారులు
- Featured - ఆంధ్రప్రదేశ్

నెల్లూరు ఎంఎల్ఏలు వర్సెస్ అధికారులు

కరోనా విపత్తు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య చిచ్చురేపింది. జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పేదలకు ఉచిత సరుకుల పంపిణీ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది.నిన్న బుచ్చిరెడ్డిపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పేదలకు ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ కార్యక్రమంలో లాక్ డౌన్ లోని144 సెక్షన్ను అతిక్రమించడం టూ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి పై అధికారులు కేసు నమోదు చేశారు. స్థానికంగా బుచ్చిరెడ్డిపాలెం లో ఈ పంపిణీ కార్యక్రమం జరగడంతో అక్కడి సీఐ సురేష్ బాబు ఉ ఎస్ఐలను జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ సెట్లో తీవ్రంగా మందలించారు. దీనిపై ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఆగ్రహించారు. ఇవాళ బుచ్చిరెడ్డిపాలెం లోని పోలీస్ స్టేషన్ వద్ద ఆయన బైఠాయించారు కరోనా విపత్తు సమయంలో పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేస్తే దానిపై అధికారులు రాద్ధాంతం చేయడం, కేసులు నమోదు చేయడం ఏమిటంటూ ఆయన మండిపడ్డారు. ఇవాళ ఉదయం 10 గంటలకు బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి దాదాపు మూడు గంటల పాటు ఆందోళన చేశారు. దాంతో జిల్లా కలెక్టర్ రంగప్రవేశం చేసి వివాదాన్ని సర్దుబాటు చేశారు. ఇదే సమయంలో జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి మద్దతుగా నిలిచారు.. జిల్లా వైసీపీ అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా అధికారుల పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ముత్తుకూరు లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అధికారుల తీరును తప్పుపట్టారు.. ఎమ్మెల్యే పైనే కేసు కడతారా.. అంతటి నేరం ఏమీ చేసారంటూ.. మండిపడ్డారు. విపత్తుల సమయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్న వారిపై ఇలా కేసులు పెట్టడమేమిటని ప్రశ్నించారు. అధికారుల తీరులో మార్పు లేకుంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. మొత్తానికి నెల్లూరు జిల్లాలో కరోనా నేపథ్యంలో పేదలకు నిత్యావసరాలు అందజేసే ఈ కార్యక్రమం ఇప్పుడు అధికారులకు అధికార పార్టీ శాసనసభ్యులకు మధ్య చిచ్చు పెట్టింది.. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న చర్చ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

కరోనా విపత్తు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య చిచ్చురేపింది. జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పేదలకు ఉచిత సరుకుల పంపిణీ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది.నిన్న బుచ్చిరెడ్డిపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పేదలకు ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ కార్యక్రమంలో లాక్ డౌన్ లోని144 సెక్షన్ను అతిక్రమించడం టూ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి పై అధికారులు కేసు నమోదు చేశారు. స్థానికంగా బుచ్చిరెడ్డిపాలెం లో ఈ పంపిణీ కార్యక్రమం జరగడంతో అక్కడి సీఐ సురేష్ బాబు ఉ ఎస్ఐలను జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ సెట్లో తీవ్రంగా మందలించారు. దీనిపై ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఆగ్రహించారు. ఇవాళ బుచ్చిరెడ్డిపాలెం లోని పోలీస్ స్టేషన్ వద్ద ఆయన బైఠాయించారు కరోనా విపత్తు సమయంలో పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేస్తే దానిపై అధికారులు రాద్ధాంతం చేయడం, కేసులు నమోదు చేయడం ఏమిటంటూ ఆయన మండిపడ్డారు. ఇవాళ ఉదయం 10 గంటలకు బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి దాదాపు మూడు గంటల పాటు ఆందోళన చేశారు. దాంతో జిల్లా కలెక్టర్ రంగప్రవేశం చేసి వివాదాన్ని సర్దుబాటు చేశారు. ఇదే సమయంలో జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి మద్దతుగా నిలిచారు.. జిల్లా వైసీపీ అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా అధికారుల పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ముత్తుకూరు లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అధికారుల తీరును తప్పుపట్టారు.. ఎమ్మెల్యే పైనే కేసు కడతారా.. అంతటి నేరం ఏమీ చేసారంటూ.. మండిపడ్డారు. విపత్తుల సమయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్న వారిపై ఇలా కేసులు పెట్టడమేమిటని ప్రశ్నించారు. అధికారుల తీరులో మార్పు లేకుంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. మొత్తానికి నెల్లూరు జిల్లాలో కరోనా నేపథ్యంలో పేదలకు నిత్యావసరాలు అందజేసే ఈ కార్యక్రమం ఇప్పుడు అధికారులకు అధికార పార్టీ శాసనసభ్యులకు మధ్య చిచ్చు పెట్టింది.. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న చర్చ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.