నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కచేరి దేవరాయపల్లి గ్రామంలో నివసిస్తున్న ఒక నిరుపేద గిరిజన కుటుంబానికి మెట్టుకూరు బ్రదర్స్ ఆర్థిక సహాయం అందించారు. గ్రామంలో గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానిక జనసేన పార్టీ నేతలు భరత్, బీవీ రమణ మెట్టుకూరు బ్రదర్స్ దృష్టికి తీసుకెళ్లగా, వారు వెంటనే స్పందించి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈరోజు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసి మానవతా భావాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమం మెట్టుకూరు బ్రదర్స్ సహకారంతో టీడీపీ గ్రామ అధ్యక్షుడు బొల్లినేని ప్రభాకర్, అనంతసాగరం చెరువు వైస్ చైర్మన్ తిరుపతి కరివేటి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సభ్యుడు కేవీ రమణయ్య, అంతిమ తీర్పు కృష్ణ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఈ సహాయంపై సంతోషం వ్యక్తం చేస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు.

నిరుపేద గిరిజన కుటుంబానికి మెట్టుకూరు బ్రదర్స్ ఆర్థిక సాయం
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కచేరి దేవరాయపల్లి గ్రామంలో నివసిస్తున్న ఒక నిరుపేద గిరిజన కుటుంబానికి మెట్టుకూరు బ్రదర్స్ ఆర్థిక సహాయం అందించారు. గ్రామంలో గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానిక జనసేన పార్టీ నేతలు భరత్, బీవీ రమణ మెట్టుకూరు బ్రదర్స్ దృష్టికి తీసుకెళ్లగా, వారు వెంటనే స్పందించి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈరోజు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసి మానవతా భావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమం మెట్టుకూరు బ్రదర్స్ సహకారంతో టీడీపీ గ్రామ అధ్యక్షుడు బొల్లినేని ప్రభాకర్, అనంతసాగరం చెరువు వైస్ చైర్మన్ తిరుపతి కరివేటి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సభ్యుడు కేవీ రమణయ్య, అంతిమ తీర్పు కృష్ణ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఈ సహాయంపై సంతోషం వ్యక్తం చేస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు.

