Saturday, 28 February 2026
  • Home  
  • నిమ్మతోటలో విషాదం.. విద్యుత్ షాక్‌తో రైతు మృతి
- అన్నమయ్య

నిమ్మతోటలో విషాదం.. విద్యుత్ షాక్‌తో రైతు మృతి

నిరంతరం కష్టపడి సాగు చేసే రైతును విద్యుత్ రూపంలో మృత్యువు కబళించింది. చిట్వేలి మండల పరిధిలోని పత్తిగుంటవారిపల్లెకు చెందిన రైతు రాఘవ నరసరాజు (59) శనివారం విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామస్థుల కథనం మేరకు.. రాఘవ చంగల్‌రాజు కుమారుడైన నరసరాజు శనివారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో తన పొలంలోని నిమ్మతోటకు నీరు కట్టేందుకు వెళ్లారు. విద్యుత్ మోటార్ ఆన్ చేసే క్రమంలో, లైన్ పైనుంచి మోటార్‌లోకి వెళ్లే వైరు తెగి కింద పడి ఉండటాన్ని ఆయన గమనించలేదు. ప్రమాదవశాత్తు ఆ వైరు తగలడంతో విద్యుత్ షాక్ తగిలి ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. పొలం వద్దకు వెళ్లిన తోటి రైతులు గమనించేసరికే ఆయన ప్రాణాలు కోల్పోయారు.మృతుడు నరసరాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. ప్రమాదవశాత్తు జరిగిన ఈ సంఘటనపై గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సాగు పనుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయిన నరసరాజు కుటుంబాన్ని ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని, తక్షణమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని పత్తిగుంటవారిపల్లె గ్రామస్థులు మరియు రైతు సంఘం నాయకులు కోరుతున్నారు.

నిరంతరం కష్టపడి సాగు చేసే రైతును విద్యుత్ రూపంలో మృత్యువు కబళించింది. చిట్వేలి మండల పరిధిలోని పత్తిగుంటవారిపల్లెకు చెందిన రైతు రాఘవ నరసరాజు (59) శనివారం విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
గ్రామస్థుల కథనం మేరకు.. రాఘవ చంగల్‌రాజు కుమారుడైన నరసరాజు శనివారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో తన పొలంలోని నిమ్మతోటకు నీరు కట్టేందుకు వెళ్లారు. విద్యుత్ మోటార్ ఆన్ చేసే క్రమంలో, లైన్ పైనుంచి మోటార్‌లోకి వెళ్లే వైరు తెగి కింద పడి ఉండటాన్ని ఆయన గమనించలేదు. ప్రమాదవశాత్తు ఆ వైరు తగలడంతో విద్యుత్ షాక్ తగిలి ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. పొలం వద్దకు వెళ్లిన తోటి రైతులు గమనించేసరికే ఆయన ప్రాణాలు కోల్పోయారు.మృతుడు నరసరాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. ప్రమాదవశాత్తు జరిగిన ఈ సంఘటనపై గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సాగు పనుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయిన నరసరాజు కుటుంబాన్ని ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని, తక్షణమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని పత్తిగుంటవారిపల్లె గ్రామస్థులు మరియు రైతు సంఘం నాయకులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.