— పున్నమి ప్రతినిధి
దేశవ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న నేపథ్యంలో IIT దిల్లీ శాస్త్రవేత్తలు వినూత్న పరిష్కారాన్ని అభివృద్ధి చేశారు. వారు రూపొందించిన ప్రత్యేక వాషింగ్ పౌడర్తో ఉతికిన బట్టలు ధరించినప్పుడు దోమలు దగ్గరికి రాకుండా రక్షణ కవచంలా పనిచేస్తాయని తెలిపారు. ఈ వాషింగ్ పౌడర్లో ప్రత్యేకంగా రూపొందించిన దోమల నిరోధక రసాయనాలను వినియోగించినట్లు వెల్లడించారు.


