శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముత్యాలమ్మ గుడి వీధి కోర్టు సమీపంలో ఉన్న టైలర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం వద్ద టైలర్స్ డే సందర్భంగా నిర్వహించిన వేడుకలలో హాజరైనారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, టైలర్స్ కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం టైలర్ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ….గతంలో తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో టైలర్లు పెద్ద వారుగా గుర్తించి, ప్రతి టైలర్ సోదరుడికి సొంతిల్లు కల్పించాలని సంకల్పించి గోపాలకృష్ణారెడ్డి బృందావన టైలర్ కాలనీలో ఇళ్ల స్థలాలు మంజూరు చేసిన విషయాన్ని స్మరించుకున్నారు. టైలర్ సోదర సోదరీమణులు నైపుణ్యాభివృద్ధి సాధించి, ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు. టైలర్స్ సంక్షేమానికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం ట్రైలర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారిని పూలమాలవేసి దృశ్యాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు తోట్టాంబేడు బాలయ్య, ఉపాధ్యక్షులు చెంజి సుబ్రహ్మణ్యం (మణి), మౌలా, రమేష్, కార్యదర్శి చెంగయ్య, ఖజాంచీ చరణ్ టైలర్, గౌరవ కమిటీ సభ్యులు పోలూరు శ్రీనివాసులు రెడ్డి, జీవి అమర్నాథ్ తదితరులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిధులు లీగల్ అడ్వైజర్ కండ్రిగ ఉమా, పట్టణ టీడీపీ అధ్యక్షులు విజయ్ కుమార్, మునిరాజు నాయుడు, చెంచయ్య నాయుడు, అంజూరు చక్రధర్ (జనసేన నాయకులు) తదితరులు పాల్గొన్నారు. టైలర్ సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

దర్జీ సోదరులు ఐక్యతతో ముందుకు సాగాలి – ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముత్యాలమ్మ గుడి వీధి కోర్టు సమీపంలో ఉన్న టైలర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం వద్ద టైలర్స్ డే సందర్భంగా నిర్వహించిన వేడుకలలో హాజరైనారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, టైలర్స్ కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం టైలర్ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ….గతంలో తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో టైలర్లు పెద్ద వారుగా గుర్తించి, ప్రతి టైలర్ సోదరుడికి సొంతిల్లు కల్పించాలని సంకల్పించి గోపాలకృష్ణారెడ్డి బృందావన టైలర్ కాలనీలో ఇళ్ల స్థలాలు మంజూరు చేసిన విషయాన్ని స్మరించుకున్నారు. టైలర్ సోదర సోదరీమణులు నైపుణ్యాభివృద్ధి సాధించి, ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు. టైలర్స్ సంక్షేమానికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం ట్రైలర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారిని పూలమాలవేసి దృశ్యాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు తోట్టాంబేడు బాలయ్య, ఉపాధ్యక్షులు చెంజి సుబ్రహ్మణ్యం (మణి), మౌలా, రమేష్, కార్యదర్శి చెంగయ్య, ఖజాంచీ చరణ్ టైలర్, గౌరవ కమిటీ సభ్యులు పోలూరు శ్రీనివాసులు రెడ్డి, జీవి అమర్నాథ్ తదితరులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిధులు లీగల్ అడ్వైజర్ కండ్రిగ ఉమా, పట్టణ టీడీపీ అధ్యక్షులు విజయ్ కుమార్, మునిరాజు నాయుడు, చెంచయ్య నాయుడు, అంజూరు చక్రధర్ (జనసేన నాయకులు) తదితరులు పాల్గొన్నారు. టైలర్ సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

