పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 22 : మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులొ రంగారెడ్డి జిల్లా జాగృతి అధ్యక్షులు పాండురంగారెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గం జనంబాట లో భాగంగా రెండు రోజులు రంగారెడ్డి జిల్లా పర్యటిస్తున్నాం. మహేశ్వరం, ఎల్ బీ నగర్, ఇబ్రహీం పట్నంలోని సమస్యలను ఇవ్వాళ తెలుసుకుంటాం. ప్రజలకు ఉన్న అనేక సమస్యలు వాటిని ఎలా పరిష్కరించాలన్న దానిపై స్థానికులు, మేధావులతో చర్చిస్తున్నాం. నిన్న శేరిలింగంపల్లి నుంచి రాజేంద్ర నగర్, చేవెళ్ల, షాద్ నగర్ లో ఉన్న సమస్యలు తెలుసుకున్నాం. నియోజకవర్గ స్థాయిలో గతంలో ఉన్న ఆఫీస్ లు కాకుండా ఇది తొలి అడుగు. మహేశ్వరంలో జాగృతి కార్యాలయం ద్వారా ప్రజలకు మంచి జరగాలి. మహేశ్వరం అంటేనే లక్కీ అనే పేరు ఉంది. జాగృతి కి కూడా శుభం జరగాలి.మహేశ్వరంలో గతంలో ఉద్యమంలో పనిచేసిన జాగృతి కార్యకర్తలు మళ్లీ సొంత గూటికి చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున చేరుతూ జాగృతిని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలను నాయకులను కోరారు

* తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించిన కల్వకుంట్ల కవిత *
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 22 : మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులొ రంగారెడ్డి జిల్లా జాగృతి అధ్యక్షులు పాండురంగారెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గం జనంబాట లో భాగంగా రెండు రోజులు రంగారెడ్డి జిల్లా పర్యటిస్తున్నాం. మహేశ్వరం, ఎల్ బీ నగర్, ఇబ్రహీం పట్నంలోని సమస్యలను ఇవ్వాళ తెలుసుకుంటాం. ప్రజలకు ఉన్న అనేక సమస్యలు వాటిని ఎలా పరిష్కరించాలన్న దానిపై స్థానికులు, మేధావులతో చర్చిస్తున్నాం. నిన్న శేరిలింగంపల్లి నుంచి రాజేంద్ర నగర్, చేవెళ్ల, షాద్ నగర్ లో ఉన్న సమస్యలు తెలుసుకున్నాం. నియోజకవర్గ స్థాయిలో గతంలో ఉన్న ఆఫీస్ లు కాకుండా ఇది తొలి అడుగు. మహేశ్వరంలో జాగృతి కార్యాలయం ద్వారా ప్రజలకు మంచి జరగాలి. మహేశ్వరం అంటేనే లక్కీ అనే పేరు ఉంది. జాగృతి కి కూడా శుభం జరగాలి.మహేశ్వరంలో గతంలో ఉద్యమంలో పనిచేసిన జాగృతి కార్యకర్తలు మళ్లీ సొంత గూటికి చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున చేరుతూ జాగృతిని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలను నాయకులను కోరారు

