Monday, 30 March 2026
  • Home  
  • తుపాను ప్రభావం ఉన్న జిల్లాల్లో ఈ రోజే రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తుపాను ప్రభావం ఉన్న జిల్లాల్లో ఈ రోజే రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ

మొంథా తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. తుపాను కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కీలక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా తుపాను ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో రేపటి నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయనుంది. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఏలూరు జిల్లాలో తుపాను ముందస్తు చర్యలను నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కీలక విషయాలు వెల్లడించారు. మొంథా తుపాను.. వారికి రూ.3000 సాయం.. చంద్రబాబు ప్రకటన.. తుపాను హెచ్చరికలు నేపథ్యంలో ప్రజలకు క్షేత్రస్థాయి లో సేవలందించేందుకు పౌర సరఫరా శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని 12 జిల్లాలలో మొంథా తుపాను ప్రభావం అత్యధికంగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నట్లు వివరించారు. మొంథా తుపాను ప్రభావం కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నారు. భారీ వానలు.. ఏ జిల్లాల్లో ఎన్ని రోజులు సెలవులంటే? ఈ నేపథ్యంలో ఈ 12 జిల్లాల్లో రేపు (మంగళవారం) ఉదయం 9 గంటల నుంచే రేషన్ దుకాణాల్లో నిత్యావసర సరుకులు అందజేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ 12 జిల్లాలలో14,145 రేషన్ షాపులు అందుబాటులో ఉన్నాయని.. వాటి ద్వారా 7 లక్షల మందికి నిత్యావసరాలు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగితే.. అలాంటి ప్రాంతాల్లో జనరేటర్స్ అందుబాటులో ఉంచామన్న నాదెండ్ల మనోహర్.. వాటికి అవసరమైన డీజిల్, కిరోసిన్ కూడా సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. 12 జిల్లాల్లో 626 పెట్రోల్, డీజిల్ ఆయిల్ కంపెనీ అవుట్లెట్లు ఉన్నాయని…పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా ఉండేందుకు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంచామన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు 30,000 టార్పాలిన్లు సైతం అందుబాటులో ఉంచినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. తుపాను ఎఫెక్ట్.. మూడ్రోజుల పాటు 43 రైళ్లు రద్దు.. జాబితా ఇదే.. మొంథా తుపాను.. పవన్ కళ్యాణ్ సమీక్ష.. మరోవైపు మొంథా తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటనుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్షించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా పరిధిలోని 12 మండలాలలో తుపాను ప్రభావం ఉంటుందని.. ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రాణ నష్టం లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. గర్భిణులు, బాలింతలు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఆంబులెన్సులు, అత్యవసర సర్వీసులు సిద్ధం చేసుకోవాలని, ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచుకోవాలని పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు. మండలాల వారీగా కంట్రోల్ రూములు ఏర్పాటు సహా.. అత్యవసర ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

మొంథా తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. తుపాను కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కీలక చర్యలు చేపడుతోంది.
అందులో భాగంగా తుపాను ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో రేపటి నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయనుంది. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఏలూరు జిల్లాలో తుపాను ముందస్తు చర్యలను నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కీలక విషయాలు వెల్లడించారు.

మొంథా తుపాను.. వారికి రూ.3000 సాయం.. చంద్రబాబు ప్రకటన..

తుపాను హెచ్చరికలు నేపథ్యంలో ప్రజలకు క్షేత్రస్థాయి లో సేవలందించేందుకు పౌర సరఫరా శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని 12 జిల్లాలలో మొంథా తుపాను ప్రభావం అత్యధికంగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నట్లు వివరించారు. మొంథా తుపాను ప్రభావం కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నారు.

భారీ వానలు.. ఏ జిల్లాల్లో ఎన్ని రోజులు సెలవులంటే?

ఈ నేపథ్యంలో ఈ 12 జిల్లాల్లో రేపు (మంగళవారం) ఉదయం 9 గంటల నుంచే రేషన్ దుకాణాల్లో నిత్యావసర సరుకులు అందజేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ 12 జిల్లాలలో14,145 రేషన్ షాపులు అందుబాటులో ఉన్నాయని.. వాటి ద్వారా 7 లక్షల మందికి నిత్యావసరాలు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగితే.. అలాంటి ప్రాంతాల్లో జనరేటర్స్ అందుబాటులో ఉంచామన్న నాదెండ్ల మనోహర్.. వాటికి అవసరమైన డీజిల్, కిరోసిన్ కూడా సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. 12 జిల్లాల్లో 626 పెట్రోల్, డీజిల్ ఆయిల్ కంపెనీ అవుట్లెట్లు ఉన్నాయని…పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా ఉండేందుకు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంచామన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు 30,000 టార్పాలిన్లు సైతం అందుబాటులో ఉంచినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు.

తుపాను ఎఫెక్ట్.. మూడ్రోజుల పాటు 43 రైళ్లు రద్దు.. జాబితా ఇదే..

మొంథా తుపాను.. పవన్ కళ్యాణ్ సమీక్ష..

మరోవైపు మొంథా తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటనుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్షించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా పరిధిలోని 12 మండలాలలో తుపాను ప్రభావం ఉంటుందని.. ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రాణ నష్టం లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు.

గర్భిణులు, బాలింతలు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఆంబులెన్సులు, అత్యవసర సర్వీసులు సిద్ధం చేసుకోవాలని, ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచుకోవాలని పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు. మండలాల వారీగా కంట్రోల్ రూములు ఏర్పాటు సహా.. అత్యవసర ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.