🔸 తిరుపతిలో ఎమ్మెల్సీ హరి ప్రసాద్ పి కి ఘన స్వాగతం… జనసేన నేతల ఆత్మీయ పలకరింపు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసిన ఎమ్మెల్సీ శ్రీ హరి ప్రసాద్ పి గారికి తిరుపతిలో జనసేన పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సెక్రటరీ అకేపాటి సుభాషిణి గారు ఆత్మీయంగా పలకరించారు.
ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైస్సార్సీపీ) నుంచి వచ్చిన రాజకీయ దాడులను ధైర్యంగా ఎదుర్కొన్నారని, ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన తీరు ప్రశంసనీయమని ఆమె తెలిపారు. అయితే భవిష్యత్తులో కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మరింత మంచిదని సూచించారు.
ప్రత్యేకంగా ఘాటైన వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని హితవు పలుకుతూ, జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యాఖ్యలను సమర్థించరని స్పష్టం చేశారు. అదే సమయంలో పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని ఎమ్మెల్సీ హరి ప్రసాద్ పి గారిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



