అయినవిల్లి మండలం సబ్ ఇన్స్పెక్టర్
కే.జ్యోతి ఆధ్వర్యంలో హెల్మెట్ గూర్చి వాహనదారులకు అవగాహన కల్పించారు.
వాహనదారులు లైసెన్స్, ఆర్సీ, హెల్మెట్ తప్పనిసరి అని హెచ్చరించి, నిబంధనలు పాటించని వారికి జరిమానా విధిస్తున్నారు.
అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి వారి చట్టపర చర్యలు తీసుకుంటున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలంలోని ప్రధాన రహదారులలో ఈ తనిఖీలు నిర్వహించారు. BIS సర్టిఫైడ్ హెల్మెట్లు వాడాలని, నాణ్యమైన హెల్మెట్లు ప్రాణాలను కాపాడతాయని కూడా పోలీసులు అవగాహన కల్పించారు.


