

శ్రీకాకుళం యువతను, విద్యార్థులను బావితర ఉత్తమ నాయకులుగా తీర్చిదిద్దుతామని, జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు హెజిఫ్ కూన.అనిల్ కుమార్ అన్నారు. జేసీఐ శ్రీకాకుళం మెయిన్ఆధ్వర్యంలో జేసీఐ వీక్ ను వేడుకగా నిర్వహించారు. స్థానిక ప్రెవేట్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు కూన. అనిల్ కుమార్ కుమార్ మంగళవారం మాట్లాడుతూ శ్రీకాకుళం జేసీఐ వ్యవస్థాపకులు డా. జామి.భీమశంకర్ సహకారంతో ఈ ఏడాది నలభై వసంతాలు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని, అధ్యక్షురాలుగా ప్రస్తుత కార్యదర్శి తమ్మినేని. ఉషారాణి సేవలందించనున్నారన్నారు.
జెసిఐ వారోత్సవాల్లో కార్యక్రమాలను విజయంలోభాగమైన ప్రతీసభ్యునికీ ప్రత్యేక కృతజ్ఞతలని, ఇందులో భాగముగా జేసీఐ సభ్యులబృందాన్ని సత్కరించామని, జెసిఐ వారోత్సవాలను విజయవంతం చేసిన ప్రతీ సభ్యునికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
జెసిఐ ఇండియా జోన్ 4 మెంటర్ కె.వి. రావు, జూనియర్ జేసీ వింగ్ గొంప.సురేష్, జోన్ డైరెక్టర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బి. దిలీప్ కుమార్ మాట్లాడుతూ జేసీఐ శ్రీకాకుళం మెయిన్ కు ప్రత్యేక స్థానముందని, శ్రీకాకుళం జిల్లాలో చాలామంది యువత వక్తలుగా, ఉత్తమ నాయకులుగా తయారవటంలో జేసీఐ పాత్ర పోషించటం హర్షణీయమన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన సెక్రటరీ తమ్మినేని ఉష రాణి కు, ప్రశంసా పత్రాన్ని అతిధులచే అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జేసీ సభ్యులు, జేసీఐ శ్రీకాకుళం సన్ రైస్ ప్రెసిడెంట్ సింగూరు ప్రవీణ్, వైజాగ్ వారియర్స్ ప్రెసిడెంట్ వెంకటరమణ, శ్రీకాకుళం జేసీస్ , జేసీఐ శ్రీకాకుళం మెయిన్ సభ్యుల బృందం కోరాడ రమేష్,జగదీష్, కృష్ణకాంత్, మనీశర్మ,శివ తేజ,స్వాతి, మాధవి,రజిని, జామి అనురాధ, నరేంద్ర, రౌతు శ్రీనివాసరావు, మండవల్లి రవి, సూర్యారావు, ప్రత్యూష, వి టి నాయుడు, భాగ్యలక్ష్మి మొదలగు సభ్యులు పాల్గొన్నారు….

