Tuesday, 31 March 2026
  • Home  
  • జీఎస్టీ తగ్గింపు రేపే.. 375 వస్తువుల ధరలు ఫుల్ లిస్ట్ ఇదే
- ఆంధ్రప్రదేశ్

జీఎస్టీ తగ్గింపు రేపే.. 375 వస్తువుల ధరలు ఫుల్ లిస్ట్ ఇదే

సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @ వస్తు సేవల పన్ను జీఎస్టీ తగ్గింపు సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం నుంచే మొదలవుతోంది. కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి వచ్చిన తర్వాత మొత్తం 375 రకాల వస్తువులు, ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. డైరీ ఉత్పత్తులు, కార్ల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇప్పటికే ఆయా కంపెనీలు ధరల తగ్గింపు ప్రకటనలు చేశాయి. మరి అందులోని ముఖ్యమైన వస్తువుల జాబితా ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) సంస్కరణలు సెప్టెంబర్ 22, 2025 నుంచే అమలులోకి వస్తున్నాయి. ఈనెల మొదటి వారంలో వస్తు సేవల పన్ను మండలి కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 5, 18 శాతం పన్ను శ్లాబులను కొనసాగిస్తూ 12, 28 శ్లాబులను తొలగించింది. దీంతో సెప్టెంబర్ 22 నుంచి 5, 18 శాతం పన్ను శ్లాబులే అమలు అవుతాయి. దీంతో ఏకంగా 375 రకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఈ జాబితాలో డైరీ ప్రొడక్ట్స్, కార్లు, ఔషధాలు, వంట సామగ్రి నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు చాలా కేటగిరీల వస్తువులు ఉన్నాయి. ఏ వస్తువుల ధరలు తగ్గుతున్నాయి? ఆహార పదార్థాలు ఆహార పదార్థాల జాబితాలో పాలతో ఉన్న పానియాలు, ఘనీభవించిన పాలు, బిస్కెట్లు, కార్న్ ఫ్లేక్స్, సీరల్స్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్ పల్ప్, ఫ్రూట్ జూస్, నెయ్యి, ఐస్ క్రీమ్, జామ్, ఫ్రూట్ జెలీస్, కెచప్, ఉప్పు, పనీర్, పాస్ట్రీ, మాంసం, ప్యాకేజ్డ్ కొబ్బరీ నీళ్లు ఉన్నాయి. రోజు వారీ వస్తువులు.. షేవ్ లోషన్, ఫేస్ క్రీమ్, ఫేస్ పౌడర్, హెయిర్ ఆయిల్, షాంపూ, షేవింగ్ క్రీమ్, టాల్కమ్ పౌండర్, టూత్ బ్రస్, టాయిలెట్ సబ్బులు వంటివి ఉన్నాయి. ఔషధాలు.. డయాగ్నస్టిక్ కిట్లు, గ్లూకో మీటర్లు వంటి మెడికల్ డివైజులపై జీఎస్టీ 5 శాతానికి తగ్గుతుంది. దీంతో వాటి ధరలు తగ్గుతాయి. వాటిపై ఎంఆర్‌పీ ధరలను తగ్గించాలని కేంద్రం ఫార్మసీలను ఆదేశించింది. బ్యూటీ, ఫిజికల్ సర్వీసెస్‌లో బార్బెర్స్, ఫిట్‌నెస్ సెంటర్స్, హెల్త్ క్లబ్స్, సెలూన్స్, యోగా కేంద్రాల వంటి వాటిపై జీఎస్టీ తగ్గుతుంది. వాటి ధరలు దిగివస్తాయి. ఇంటి నిర్మాణ ఖర్చులు ఇంటి కొనుగోలుదారులు లేదా నిర్మాణదారులకు జీఎస్టీ ద్వారా భారీగా ప్రయోజనం కలగనుంది. సిమెంట్ ధరలపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గుతుంది. దీంతో నిర్మాణ ఖర్చు భారీగా తగ్గనుంది. ఆటోమొబైల్స్ కార్లు, ఇతర వాహనాలపై జీఎస్టీ భారీగా తగ్గుతుంది. ఇంతకు ముందు పన్నులు సెస్ ‌తో కలిపి 35 శాతం నుంచి 50 శాతం వరకు ఉండేవి. ఇప్పుడు ఫ్లాట్ 40 శాతం గా మార్చారు. సెస్ ఎత్తివేశారు. దీంతో గరిష్ఠ పన్ను ఇదే. అలాగే చిన్న కార్లపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించారు. ఇప్పటికే మారుతీ, టాటా వంటి కంపెనీలు ధరల తగ్గింపు ప్రకటనలు చేశాయి. దీంతో సెప్టెంబర్ 22, 2025 నుంచి ఆయా కంపెనీల ఉత్పత్తుల ధరలు దిగివస్తాయి. హిందుస్తాన్ యూనిలివర్ ఉత్పత్తులైన డవ్ షాంపూ బాటిల్ 340 ఎంఎల్ ధర రూ.490 నుంచి రూ.435కు తగ్గుతుంది. నాలుగు లైఫ్ బాయ్ సబ్బుల ధర రూ. 68 నుంచి రూ.60కి తగ్గుతుంది. 200 గ్రాముల హార్లిక్స్ ధర రూ.130 నుంచి రూ.110కి తగ్గుతుంది. 200 గ్రాముల కిసాన్ జామ్ ధర రూ.10 తగ్గి రూ.80కే లభిస్తుంది. ఇక ప్రభుత్వ రంగ సంస్థ రైల్వే బోర్డ్ 1 లీటర్ రైల్ నీర్ బాటిళ్ల ధరను రూ.15 నుంచి రూ.14కు తగ్గించినట్లు తెలిపింది. 500 ఎంఎల్ బాటిల్ ధర రూ.10 నుంచి రూ.9కి తగ్గుతుంది ప్రముఖ బ్రాండ్ల కార్ల ధరలు ఎంత తగ్గుతాయంటే? మారుతీ సుజుకీ ఆల్టో కే10 కారు ధర రూ.1,07,600 మేర తగ్గుతోంది. దీంతో రూ.3.69 లక్షలు (ఎక్స్ షోరూమ్) లభిస్తోంది. ఎస్ ప్రెస్సో ధర రూ.1,29,600 తగ్గుతోంది. సెలేరియో ధర రూ.94,100 వరకు తగ్గుతోంది. వెగన్ ఆర్ ధర రూ.79,600 తగ్గుతోంది. ఇక స్విఫ్ట్, బలెనో కారు ధర రూ.84,600 తగ్గుతోంది. ఇగ్నిస్ కారు ధర రూ.71,300 వరకు తగ్గుతోంది. టాటా కంపెనీ విషయానికి వస్తే టాటా టియాగో కారు ధర రూ.75 వేలు తగ్గుతోంది. టాటా ఆల్ట్రోజ్ కారు ధర రూ.1,10,000 వరకు తగ్గుతోంది. ఇక హ్యూందాయ్ కంపెనీలో గ్రాండ్ ఐ10 కారు ధర రూ.73,800 తగ్గుతోంది. హ్యూందాయ్ ఐ20 కారు ధర రూ.86,796 వరకు తగ్గిస్తున్నారు. తగ్గిన పాల ధరలు ప్రముఖ బ్రాండ్ అముల్ పాలతో పాటు 700 ఉత్పత్తుల ధరలు తగ్గించినట్లు తెలిపింది. వెన్న, నెయ్యి, ఐసీ క్రీమ్స్, చీజ్, పనీర్, చాక్లెట్స్, బేకరీ ఉత్పత్తులు, ఫ్రోజెన్ డైరీ ఉత్పత్తులు, పొటాటో స్నాక్స్, ఘనీభవించిన పాలు వంటివి ఉన్నాయి. వెన్న ధర 100 గ్రాములకు రూ.62 నుంచి రూ.58కి తగ్గుతుంది. నెయ్యి లీటరుపై రూ.40 తగ్గుతుంది. రూ.610కే లభిస్తుంది. చీజ్ కిలో ధర రూ.30 తగ్గి రూ.545కే లభిస్తోంది. పనీర్ ధర 200 గ్రాములకు రూ.99 నుంచి రూ.95కు తగ్గుతుంది. ఐస్ క్రీమ్స్ ధరలు రూ.9 నుంచి రూ.550 మధ్య ఉంటున్నాయి. ఇప్పటి వరకు రూ.10 నుంచి రూ.600 మధ్య ఉండేవి.

సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @
వస్తు సేవల పన్ను జీఎస్టీ తగ్గింపు సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం నుంచే మొదలవుతోంది. కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి వచ్చిన తర్వాత మొత్తం 375 రకాల వస్తువులు, ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. డైరీ ఉత్పత్తులు, కార్ల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇప్పటికే ఆయా కంపెనీలు ధరల తగ్గింపు ప్రకటనలు చేశాయి. మరి అందులోని ముఖ్యమైన వస్తువుల జాబితా ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) సంస్కరణలు సెప్టెంబర్ 22, 2025 నుంచే అమలులోకి వస్తున్నాయి. ఈనెల మొదటి వారంలో వస్తు సేవల పన్ను మండలి కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 5, 18 శాతం పన్ను శ్లాబులను కొనసాగిస్తూ 12, 28 శ్లాబులను తొలగించింది. దీంతో సెప్టెంబర్ 22 నుంచి 5, 18 శాతం పన్ను శ్లాబులే అమలు అవుతాయి. దీంతో ఏకంగా 375 రకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఈ జాబితాలో డైరీ ప్రొడక్ట్స్, కార్లు, ఔషధాలు, వంట సామగ్రి నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు చాలా కేటగిరీల వస్తువులు ఉన్నాయి. ఏ వస్తువుల ధరలు తగ్గుతున్నాయి?

ఆహార పదార్థాలు
ఆహార పదార్థాల జాబితాలో పాలతో ఉన్న పానియాలు, ఘనీభవించిన పాలు, బిస్కెట్లు, కార్న్ ఫ్లేక్స్, సీరల్స్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్ పల్ప్, ఫ్రూట్ జూస్, నెయ్యి, ఐస్ క్రీమ్, జామ్, ఫ్రూట్ జెలీస్, కెచప్, ఉప్పు, పనీర్, పాస్ట్రీ, మాంసం, ప్యాకేజ్డ్ కొబ్బరీ నీళ్లు ఉన్నాయి.

రోజు వారీ వస్తువులు..
షేవ్ లోషన్, ఫేస్ క్రీమ్, ఫేస్ పౌడర్, హెయిర్ ఆయిల్, షాంపూ, షేవింగ్ క్రీమ్, టాల్కమ్ పౌండర్, టూత్ బ్రస్, టాయిలెట్ సబ్బులు వంటివి ఉన్నాయి.

ఔషధాలు..
డయాగ్నస్టిక్ కిట్లు, గ్లూకో మీటర్లు వంటి మెడికల్ డివైజులపై జీఎస్టీ 5 శాతానికి తగ్గుతుంది. దీంతో వాటి ధరలు తగ్గుతాయి. వాటిపై ఎంఆర్‌పీ ధరలను తగ్గించాలని కేంద్రం ఫార్మసీలను ఆదేశించింది.

బ్యూటీ, ఫిజికల్ సర్వీసెస్‌లో
బార్బెర్స్, ఫిట్‌నెస్ సెంటర్స్, హెల్త్ క్లబ్స్, సెలూన్స్, యోగా కేంద్రాల వంటి వాటిపై జీఎస్టీ తగ్గుతుంది. వాటి ధరలు దిగివస్తాయి.

ఇంటి నిర్మాణ ఖర్చులు
ఇంటి కొనుగోలుదారులు లేదా నిర్మాణదారులకు జీఎస్టీ ద్వారా భారీగా ప్రయోజనం కలగనుంది. సిమెంట్ ధరలపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గుతుంది. దీంతో నిర్మాణ ఖర్చు భారీగా తగ్గనుంది.

ఆటోమొబైల్స్
కార్లు, ఇతర వాహనాలపై జీఎస్టీ భారీగా తగ్గుతుంది. ఇంతకు ముందు పన్నులు సెస్ ‌తో కలిపి 35 శాతం నుంచి 50 శాతం వరకు ఉండేవి. ఇప్పుడు ఫ్లాట్ 40 శాతం గా మార్చారు. సెస్ ఎత్తివేశారు. దీంతో గరిష్ఠ పన్ను ఇదే. అలాగే చిన్న కార్లపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించారు. ఇప్పటికే మారుతీ, టాటా వంటి కంపెనీలు ధరల తగ్గింపు ప్రకటనలు చేశాయి.

దీంతో సెప్టెంబర్ 22, 2025 నుంచి ఆయా కంపెనీల ఉత్పత్తుల ధరలు దిగివస్తాయి. హిందుస్తాన్ యూనిలివర్ ఉత్పత్తులైన డవ్ షాంపూ బాటిల్ 340 ఎంఎల్ ధర రూ.490 నుంచి రూ.435కు తగ్గుతుంది. నాలుగు లైఫ్ బాయ్ సబ్బుల ధర రూ. 68 నుంచి రూ.60కి తగ్గుతుంది. 200 గ్రాముల హార్లిక్స్ ధర రూ.130 నుంచి రూ.110కి తగ్గుతుంది. 200 గ్రాముల కిసాన్ జామ్ ధర రూ.10 తగ్గి రూ.80కే లభిస్తుంది. ఇక ప్రభుత్వ రంగ సంస్థ రైల్వే బోర్డ్ 1 లీటర్ రైల్ నీర్ బాటిళ్ల ధరను రూ.15 నుంచి రూ.14కు తగ్గించినట్లు తెలిపింది. 500 ఎంఎల్ బాటిల్ ధర రూ.10 నుంచి రూ.9కి తగ్గుతుంది

ప్రముఖ బ్రాండ్ల కార్ల ధరలు ఎంత తగ్గుతాయంటే?
మారుతీ సుజుకీ ఆల్టో కే10 కారు ధర రూ.1,07,600 మేర తగ్గుతోంది. దీంతో రూ.3.69 లక్షలు (ఎక్స్ షోరూమ్) లభిస్తోంది. ఎస్ ప్రెస్సో ధర రూ.1,29,600 తగ్గుతోంది. సెలేరియో ధర రూ.94,100 వరకు తగ్గుతోంది. వెగన్ ఆర్ ధర రూ.79,600 తగ్గుతోంది. ఇక స్విఫ్ట్, బలెనో కారు ధర రూ.84,600 తగ్గుతోంది. ఇగ్నిస్ కారు ధర రూ.71,300 వరకు తగ్గుతోంది. టాటా కంపెనీ విషయానికి వస్తే టాటా టియాగో కారు ధర రూ.75 వేలు తగ్గుతోంది. టాటా ఆల్ట్రోజ్ కారు ధర రూ.1,10,000 వరకు తగ్గుతోంది. ఇక హ్యూందాయ్ కంపెనీలో గ్రాండ్ ఐ10 కారు ధర రూ.73,800 తగ్గుతోంది. హ్యూందాయ్ ఐ20 కారు ధర రూ.86,796 వరకు తగ్గిస్తున్నారు.

తగ్గిన పాల ధరలు
ప్రముఖ బ్రాండ్ అముల్ పాలతో పాటు 700 ఉత్పత్తుల ధరలు తగ్గించినట్లు తెలిపింది. వెన్న, నెయ్యి, ఐసీ క్రీమ్స్, చీజ్, పనీర్, చాక్లెట్స్, బేకరీ ఉత్పత్తులు, ఫ్రోజెన్ డైరీ ఉత్పత్తులు, పొటాటో స్నాక్స్, ఘనీభవించిన పాలు వంటివి ఉన్నాయి. వెన్న ధర 100 గ్రాములకు రూ.62 నుంచి రూ.58కి తగ్గుతుంది. నెయ్యి లీటరుపై రూ.40 తగ్గుతుంది. రూ.610కే లభిస్తుంది. చీజ్ కిలో ధర రూ.30 తగ్గి రూ.545కే లభిస్తోంది. పనీర్ ధర 200 గ్రాములకు రూ.99 నుంచి రూ.95కు తగ్గుతుంది. ఐస్ క్రీమ్స్ ధరలు రూ.9 నుంచి రూ.550 మధ్య ఉంటున్నాయి. ఇప్పటి వరకు రూ.10 నుంచి రూ.600 మధ్య ఉండేవి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.