పున్నమి న్యూస్ (కోనసీమ), సీనియర్ జర్నలిస్ట్: మాజీ లోక్ సభ స్పీకర్, కోనసీమ అభివృద్ధి ప్రదాత కీర్తిశేషులు జీఎంసీ బాలయోగి 74 వ జయంతి సందర్భంగా అమలాపురం బాలయోగి ఘాట్ వద్ద జరిగిన జయంతి వేడుకలలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ పాల్గొని ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోనసీమ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మహోన్నత వ్యక్తి, ఆనాడే కోనసీమ కు రైల్వే లైన్ రావాలని శంకుస్థాపన చేయించారన్నారు. ఆయన లోక్ సభ స్పీకర్ అయి ఉండి కూడా అందరికీ అందుబాటులో ఉండేవారని అన్నారు. ఆయన బాట లోనే ఆయన తనయుడు స్థానిక ఎంపీ హరీష్ మాధుర్ నడుస్తున్నారని, కోనసీమకు రైలు కూత వినబడాలనే లక్యంతో ముందుకు సాగుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అరిగెల నాని, అయినవిల్లి మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ, మాకిరెడ్డి మనోజ్ తదితరులు పాల్గొన్నారు.


