శ్రీకాళహస్తి, ఏప్రిల్ 03 (పున్నమి న్యూస్): రేణిగుంట మండలం జనసేన పార్టీ మాజీ మండల అధ్యక్షుడు ముని కుమార్ హఠాన్మరణం పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం రేణిగుంట మండలం తూకివాకం గ్రామంలో జరిగిన ఆయన అంత్యక్రియల్లో జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని నివాళులర్పించారు. జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, రాష్ట్ర హస్తకళా అభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ప్రసాద్ ముని కుమార్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. పార్టీ అభివృద్ధికి ముని కుమార్ చేసిన సేవలను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. అనంతరం శోకసప్తప్త కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని ముని కుమార్ కి తుది వీడ్కోలు పలికారు.

జనసేన మాజీ మండలాధ్యక్షుడి అంత్యక్రియాల్లో పాల్గొన్న చైర్మన్ కొట్టేసాయి ప్రసాద్
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 03 (పున్నమి న్యూస్): రేణిగుంట మండలం జనసేన పార్టీ మాజీ మండల అధ్యక్షుడు ముని కుమార్ హఠాన్మరణం పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం రేణిగుంట మండలం తూకివాకం గ్రామంలో జరిగిన ఆయన అంత్యక్రియల్లో జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని నివాళులర్పించారు. జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, రాష్ట్ర హస్తకళా అభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ప్రసాద్ ముని కుమార్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. పార్టీ అభివృద్ధికి ముని కుమార్ చేసిన సేవలను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. అనంతరం శోకసప్తప్త కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని ముని కుమార్ కి తుది వీడ్కోలు పలికారు.

