శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 08: తెలుగు చిత్ర పరిశ్రమ మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని’ ప్రకటించడం పట్ల జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాన్య కుటుంబంలో జన్మించి, స్వయంకృషితో తెలుగు సినీ సామ్రాజ్యంలో అగ్రస్థానానికి చేరుకున్న చిరంజీవి గారి ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కేవలం నటుడిగానే కాకుండా, సామాజిక సేవలోనూ ఆయన అందిస్తున్న సేవలు అసమానమైనవని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి పేరు మీద ఇచ్చే ఈ గౌరవప్రదమైన పురస్కారం చిరంజీవి గారికి దక్కడం పట్ల జనసేన కార్యకర్తలు, అభిమానులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారని చక్రధర్ ఈ సందర్భంగా తెలిపారు.

చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం దక్కడం గర్వకారణం-అంజూరు చక్రధర్
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 08: తెలుగు చిత్ర పరిశ్రమ మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని’ ప్రకటించడం పట్ల జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాన్య కుటుంబంలో జన్మించి, స్వయంకృషితో తెలుగు సినీ సామ్రాజ్యంలో అగ్రస్థానానికి చేరుకున్న చిరంజీవి గారి ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కేవలం నటుడిగానే కాకుండా, సామాజిక సేవలోనూ ఆయన అందిస్తున్న సేవలు అసమానమైనవని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి పేరు మీద ఇచ్చే ఈ గౌరవప్రదమైన పురస్కారం చిరంజీవి గారికి దక్కడం పట్ల జనసేన కార్యకర్తలు, అభిమానులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారని చక్రధర్ ఈ సందర్భంగా తెలిపారు.

