
పేద విద్యార్థులు డాక్టర్లు కాకూడదా! చంద్రబాబు
పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి
జననేత జగన్మోహన్ రెడ్డి నెలకొల్పిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేయడాన్నీ వ్యతిరేకిస్తూ పాడేరులో చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆశీలమెట్ట కార్యాలయంలో గురువారం దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ జిల్లా నాయకత్వంలో నేడు 19వ తేదీన పాడేరు మెడికల్ కాలేజీ వద్ద జరగనున్న ధర్నా దద్దరిల్లనున్నదని హెచ్చరించారు. 28 కార్లు,
ఒక బస్సుతో దక్షణ స్టూడెంట్ యూత్ నాయకులు పాడేరు కార్యక్రమంకి వెళ్తున్నట్లు తెలిపారు. వైసీపీ హయంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. ఇందులో పది కళాశాలల నిర్మాణానికి 4,500 కోట్లు అవసరం అన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం ఇందుకు నిధులు లేవని పేద విద్యార్థులు డాక్టర్లు కాకూడదనే చంద్రబాబు ఈ దుర్మార్గపు ఆలోచనకు తెర తీశారని దుయ్యబట్టారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే పేద, మధ్య తరగతి విద్యార్ధులకు సీట్లు రావని ఆందోళన వ్యక్తం చేశారు. మేనజేమెంట్ కోటలో యాజమాన్యం సీట్లు అమ్మేసుకుంటారని విమర్శించారు. అల్లూరి జిల్లా పాడేరులో మెడికల్ కాలేజీ వస్తే గిరిజనులు అత్యవసర సమయాల్లో KGH వచ్చే దుస్థితి తప్పుతుందన్న ముందు చూపుతోనే జగన్ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టరన్నారు. కాగా, వైసీపీ యువజన, విద్యార్ధి సంఘాల అధ్వర్యంలో ఈనెల 19 న జరిగే చలో మెడికల్ కాలేజీ కార్యక్రమం విజయవంతానికి పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాలు, ప్రజలు , విద్యార్ధులు పెద్ద ఎత్తున తరలి రావాలని వాసుపల్లి పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దక్షిణ వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజ్” నీ విజయవంతం చేయండి!
- పేద విద్యార్థులు డాక్టర్లు కాకూడదా! చంద్రబాబు
- పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి
జననేత జగన్మోహన్ రెడ్డి నెలకొల్పిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేయడాన్నీ వ్యతిరేకిస్తూ పాడేరులో చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆశీలమెట్ట కార్యాలయంలో గురువారం దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ జిల్లా నాయకత్వంలో నేడు 19వ తేదీన పాడేరు మెడికల్ కాలేజీ వద్ద జరగనున్న ధర్నా దద్దరిల్లనున్నదని హెచ్చరించారు. 28 కార్లు,
ఒక బస్సుతో దక్షణ స్టూడెంట్ యూత్ నాయకులు పాడేరు కార్యక్రమంకి వెళ్తున్నట్లు తెలిపారు. వైసీపీ హయంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. ఇందులో పది కళాశాలల నిర్మాణానికి 4,500 కోట్లు అవసరం అన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం ఇందుకు నిధులు లేవని పేద విద్యార్థులు డాక్టర్లు కాకూడదనే చంద్రబాబు ఈ దుర్మార్గపు ఆలోచనకు తెర తీశారని దుయ్యబట్టారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే పేద, మధ్య తరగతి విద్యార్ధులకు సీట్లు రావని ఆందోళన వ్యక్తం చేశారు. మేనజేమెంట్ కోటలో యాజమాన్యం సీట్లు అమ్మేసుకుంటారని విమర్శించారు. అల్లూరి జిల్లా పాడేరులో మెడికల్ కాలేజీ వస్తే గిరిజనులు అత్యవసర సమయాల్లో KGH వచ్చే దుస్థితి తప్పుతుందన్న ముందు చూపుతోనే జగన్ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టరన్నారు. కాగా, వైసీపీ యువజన, విద్యార్ధి సంఘాల అధ్వర్యంలో ఈనెల 19 న జరిగే చలో మెడికల్ కాలేజీ కార్యక్రమం విజయవంతానికి పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాలు, ప్రజలు , విద్యార్ధులు పెద్ద ఎత్తున తరలి రావాలని వాసుపల్లి పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దక్షిణ వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.

