మహాశక్తి రూపమే మహిళ, భవిష్యత్ తరాలకు మార్గదర్శి మహిళ
పున్నమి ప్రతినిధి . రామచంద్రపురం మండలం
కాయం హరినాథ్ రెడ్డి,
మహిళ లేనిదే మనుగడలేదు
: డాక్టర్ తేజస్విని,
మహాశక్తి రూపమే మహిళ అని మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఫౌండర్ మరియు చైర్మన్ కాయం హరినాధ రెడ్డి అన్నారు. శనివారం రామచంద్రాపురం మండలం కుప్పం బాదురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కరించుకుని సేవా దృక్పథంలో పనిచేస్తున్న మహిళలను సాలవలతో సత్కరించి, చీరలు, స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశక్తి రూపమే మహిళ అని, మహిళలు సంతోషంగా ఉంటే ఆ గృహము, గ్రామము, రాష్ట్రం దేశం, సుఖశాంతులతో సుభిక్షంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో మహిళ ప్రధమ ప్రాముఖ్యమన్నారు. దేవతలు పురాతన కాలం నుంచి మహిళలు సంతోషంగా ఉన్నచోట దేవతలు నడి ఆడుతారని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ తేజస్విని మాట్లాడుతూ మహిళలతోనే మనుగడ సాధ్యమన్నారు. మహిళలు లేనిదే మానవాళి మనుగడ శూన్యం, మహిళ అవ్వగా, తల్లిగా, భార్యగా, కూతురుగా , ప్రతి ఒక్కరి జీవితంలో కొలువై ఉంటుందని అన్నారు. అనంతరం ఖాయం హరినాథ్ రెడ్డి డాక్టర్లను దుశాలవతో సత్కరించి, పాఠశాలలో వంటలు చేసే మహిళలకు, ఆరోగ్య కేంద్రంలో సేవలు చేసే మహిళలకు చీరలు పంపిణీ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పూర్ణిమ, వైద్య సిబ్బంది మహిళలు తదితరులు పాల్గొన్నారు

