Thursday, 12 March 2026
  • Home  
  • గిరి ప్రదక్షిణ మార్గంలో సూచిక బోర్డులు ఏర్పాటు, అసాంఘిక చర్యలకు కఠిన చర్యలు
- తిరుపతి

గిరి ప్రదక్షిణ మార్గంలో సూచిక బోర్డులు ఏర్పాటు, అసాంఘిక చర్యలకు కఠిన చర్యలు

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 11: ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థాన పరిసర ప్రాంతాల్లో భక్తుల భద్రత, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా గిరి ప్రదక్షిణ మార్గంలో దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానము వారు శ్రీకాళహస్తి కైలాసగిరి గిరి ప్రదక్షిణ మార్గమంతా సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ మార్గం మొత్తం సీసీ కెమెరాలు మరియు డ్రోన్ పర్యవేక్షణలో ఉందని బోర్డుల ద్వారా భక్తులకు తెలియజేశారు. దేవస్థానం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గిరి ప్రదక్షిణ మార్గంలో రోడ్డుకి ఇరువైపులా మరియు అటవీ ప్రాంతంలో మద్యం సేవించడం, చెత్త వేయడం, అడవికి నిప్పు పెట్టడం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం పూర్తిగా నిషేధం అని స్పష్టం చేశారు. భక్తులు మరియు స్థానిక ప్రజలు ఈ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రదక్షిణ మార్గంలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసేందుకు ఈ సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. ప్రకృతి సంపదను కాపాడటం, అటవీ ప్రాంతాన్ని రక్షించడం, భక్తులకు సురక్షిత వాతావరణం కల్పించడం ఈ చర్యల ప్రధాన లక్ష్యమని నిబంధనలను ఉల్లంఘించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి హెచ్చరించారు. గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు భక్తి భావంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 11: ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థాన పరిసర ప్రాంతాల్లో భక్తుల భద్రత, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా గిరి ప్రదక్షిణ మార్గంలో దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానము వారు శ్రీకాళహస్తి కైలాసగిరి గిరి ప్రదక్షిణ మార్గమంతా సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ మార్గం మొత్తం సీసీ కెమెరాలు మరియు డ్రోన్ పర్యవేక్షణలో ఉందని బోర్డుల ద్వారా భక్తులకు తెలియజేశారు. దేవస్థానం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గిరి ప్రదక్షిణ మార్గంలో రోడ్డుకి ఇరువైపులా మరియు అటవీ ప్రాంతంలో మద్యం సేవించడం, చెత్త వేయడం, అడవికి నిప్పు పెట్టడం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం పూర్తిగా నిషేధం అని స్పష్టం చేశారు. భక్తులు మరియు స్థానిక ప్రజలు ఈ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రదక్షిణ మార్గంలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసేందుకు ఈ సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. ప్రకృతి సంపదను కాపాడటం, అటవీ ప్రాంతాన్ని రక్షించడం, భక్తులకు సురక్షిత వాతావరణం కల్పించడం ఈ చర్యల ప్రధాన లక్ష్యమని నిబంధనలను ఉల్లంఘించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి హెచ్చరించారు. గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు భక్తి భావంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.