గాయపడ్డ జర్నలిస్టు నాగేష్ కు ఇబ్రహీంపట్నం సీఐ ఆర్థిక సహాయం.
ఇబ్రహీంపట్నం :-
పున్నమి న్యూస్
Tg…..
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బిగ్ టివి రిపోర్టర్ ముచ్చర్ల నాగేష్ ఇటీవల న్యూస్ కవరేజ్ కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. నిరుపేద కుటుంబానికి చెందిన నాగేష్ పరిస్థితిని గూర్చి టియుడబ్ల్యూజే (హెచ్ 143) యూనియన్ నాయకుల విజ్ఞప్తి మేరకు పరిస్థితిని అర్థం చేసుకున్న ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్ రెడ్డి మానవ దృక్పథంతో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కేంద్రంలోని లిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిపోర్టర్ నాగేష్ ను పరామర్శించి ఆయనకు 25,000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామకృష్ణ, టీయూడబ్ల్యూజే (హెచ్ 143) నియోజకవర్గ అధ్యక్షులు సురమోని సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి చెరుకూరి రాజు, సురమోని బాబు, హనుమంతు సుదర్శన్, మొలుగు శ్రీను, కిషన్, గోవర్ధన్, సైదులు ఇతర యూనియన్ సభ్యులు పి.వెంకటేష్ పి.క్రాంతి, కుమార్, తదితరులు పాల్గొన్నారు.



