*కొత్త ట్రాన్స్ఫారం కాలనీలో ఏర్పాటు చేయుట గురించి మేయర్ కు విజ్ఞప్తి చేస్తున్న మహేశ్వరి కాలనీవాసుపలు*
*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా:: తేదీ 30/03/2026*
*ఈరోజు స్థాని*క కార్పొరేషన్ మహబూబ్నగర్ యందు మేయర్ మమత మేడం గారిని 49వ డివిజన్లో కరెంటు సమస్యతో బాధపడుతున్న సమస్యను వినతి పత్రం ద్వారా వివరించడం జరిగింది. తక్షణమే 49వ డివిజన్ మహేశ్వరి కాలనీ యందు కొత్త ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయుటకై మేడంతో సవివరంగా వివరించడం జరిగింది ఆమె సానుకూలంగా స్పందించి సమస్యను త్వరలో పరిష్కరింప చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మహేశ్వరి కాలనీ అభివృద్ధి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు, ఎం.ఎన్ విజయకుమార్, కోశాధికారి రిటైర్డ్ హెడ్మాస్టర్ వెంకటకృష్ణయ్య,గారు పాల్గొని వినతిపత్రం అందించడం జరిగింది*


