మాచారెడ్డి రేంజ్లో 5 మండలాల ప్రజలకు అటవీ శాఖ హెచ్చరిక.. జాగ్రత్తలు తప్పక పాటించండి!
కామారెడ్డి,17 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి అటవీ రేంజ్ పరిధిలో పెద్దపులి సంచరిస్తున్నట్లు నిర్ధారణ అయింది. మాచారెడ్డి, రామారెడ్డి, దోమకొండ, బిబిపేట్, పాల్వంచ మండలాల గ్రామాల్లోని అటవీ ప్రాంతా లు, వ్యవసాయ క్షేత్రాల్లో పులి కనిపించడం గుర్తిం చిన అధికారులు ప్రజలకు జాగ్రత్తలు తెలియజే శారు.అటవీ శాఖ అధికారులు జారీ చేసిన హెచ్చ రిక ప్రకారం, గ్రామ ప్రజలు తప్పకుండా ఈ నియ మాలు పాటించాలి:అటవీ ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లకూడదు.సాయంత్రం 5 గంటల నుంచి ఉద యం 7 గంటల వరకు వ్యవసాయ భూముల్లో తిరగకూడదు.రాత్రిపూట పశువులను క్షేత్రాల్లో ఉంచకూడదు.పగలు కూడా ఒంటరిగా వ్యవసా య క్షేత్రాలకు వెళ్లకూడదు.పులి దాడి సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అటవీ అధికారులకు లేదా పోలీసులకు ఫోన్ చేయాలని సూచించారు. పశువులపై దాడి జరిగినా, పులి లేదా ఆనవాలు కనిపించినా వెంటనే సమాచారం ఇవ్వండి – తగి న నష్టపరిహారం పొందవచ్చు.కఠిన హెచ్చరిక: పులికి నష్టం కలిగించేలా కరెంటు వైర్లు, ఉచ్చులు పెట్టడం లేదా విషప్రయోగం చేయడం అటవీ చట్టం ప్రకారం శిక్షార్హులు ఇలాంటి చర్యలు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.సంప్రదించండి: అటవీ శాఖ – 8555830266, 9490411547, 7981949524 .కామారెడ్డి డివిజన్ అటవీ శాఖ, మాచారెడ్డి రేంజ్ ప్రజల సురక్షితంగా ఉండేందుకు అందరూ సహక రించాలని కోరారు. ఇలాంటి సంఘటనలపై మరి న్ని వివరాలు తెలిసినప్పుడు తాజా అప్డేట్స్ అందిస్తాంమన్నారు.


