స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అధ్యాపకులతో సహా విద్యార్థిని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 న రాష్ట్రీయ ఏక్తా దివస్ జరుపుకుంటారని, భారతదేశ ఐక్యత, సమగ్రత మరియు జాతీయ సంఘీభావాన్ని రాష్ట్రీయ ఏక్తా దివస్ సూచిస్తుందని, దేశ సార్వభౌమత్వం, ఐక్యతను పెంపొందించడానికి అన్ని కళాశాలల్లోని విద్యార్థులతో జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞ చేయించడం సమైక్యత పట్ల మనందరిలో బాధ్యతాయుతమైన అంకిత భావాన్ని పెంపొందించడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే. కోటేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ విజయ మహేష్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ నారాయణ రాజు, అధ్యాపకులు డాక్టర్ కే. శివప్రసాద్, డాక్టర్ శైలజ, డాక్టర్ ఝాన్సీ వాణి, కిరణమై, డాక్టర్ పీర్ కుమార్, రవిరాజు, గోపాల్ తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ఎస్.కే.ఆర్. డిగ్రీ కళాశాలలో జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞ
స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అధ్యాపకులతో సహా విద్యార్థిని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 న రాష్ట్రీయ ఏక్తా దివస్ జరుపుకుంటారని, భారతదేశ ఐక్యత, సమగ్రత మరియు జాతీయ సంఘీభావాన్ని రాష్ట్రీయ ఏక్తా దివస్ సూచిస్తుందని, దేశ సార్వభౌమత్వం, ఐక్యతను పెంపొందించడానికి అన్ని కళాశాలల్లోని విద్యార్థులతో జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞ చేయించడం సమైక్యత పట్ల మనందరిలో బాధ్యతాయుతమైన అంకిత భావాన్ని పెంపొందించడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే. కోటేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ విజయ మహేష్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ నారాయణ రాజు, అధ్యాపకులు డాక్టర్ కే. శివప్రసాద్, డాక్టర్ శైలజ, డాక్టర్ ఝాన్సీ వాణి, కిరణమై, డాక్టర్ పీర్ కుమార్, రవిరాజు, గోపాల్ తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

