“ఎమ్మెల్యే సార్… రోడ్లు కాదు, ఇవి మరణపు గుంతలు!”
“ప్రజలు చస్తేనే మీకు గుర్తొస్తుందా ఈ రోడ్డు?”
ప్రజలు ఓటు వేసి గెలిపించిన నాయకులు,
ఈ రోజు అదే ప్రజలు రోడ్లపై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎందుకు?
పున్నమి న్యూస్ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్:
20 మార్చి 2026
యాచారం – మేడిపల్లి రోడ్ పరిస్థితి:
గుంతలు కాదు… ప్రాణాలు తీసే ఉచ్చులు
అర్ధాంతరంగా వదిలేసిన పనులు — ఎవరి బాధ్యత?
హెచ్చరిక బోర్డులు లేవు… రక్షణ చర్యలు లేవు
ఒక్క ప్రమాదం జరిగినా బాధ్యత ఎవరు తీసుకుంటారు?
ఇది నిర్లక్ష్యం కాదు… ప్రజల ప్రాణాలతో చెలగాటం!!!
ఎమ్మెల్యే గారు… ఈ రోడ్డు మీద మీరు ఎప్పుడైనా ప్రయాణించారా?
ఈ గుంతల్లో పడేది ప్రజలే కాబట్టి పట్టించుకోవట్లేదా?
ఓట్లు వేసే సమయంలో మాత్రమే ప్రజలు గుర్తొస్తారా?
వెంటనే పనులు పూర్తి చేయాలి
ప్రమాదకర ప్రాంతాల్లో బారికేడ్లు & లైట్లు ఏర్పాటు చేయాలి
బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
“ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే … ప్రజలే సమాధానం చెబుతారు!”






