ఎన్టీఆర్ జిల్లా,
తిరువూరు పట్టణం..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మహిళా విభాగం ఆధ్వర్యంలో నకిలీ మద్యంకు వ్యతిరేకంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీకి వైసీపీ మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు పి.సుధారాణి నాయకత్వం వహించారు.
భారీ వర్షంలో కూడా ఈ ర్యాలీ కొనసాగించారు ర్యాలీలో పాల్గొన్నవారు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు చేశారు.
నకిలీ మద్యం గుట్టును పూర్తిగా బయటపెట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు, పర్మిట్ రూములు, బార్లు, బెల్ట్ దుకాణాలపై తనిఖీలు చేపట్టాలి.
నకిలీ మద్యం అంశంపై సిబిఐ (CBI) దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
వైన్ షాపులను ప్రభుత్వమే నిర్వహించేలా చొరవ చూపాలి.
ఎక్సైజ్ కార్యాలయంలో సీఐ నిక్సన్కు ఈ డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల నుండి అధిక సంఖ్యలో మహిళా విభాగ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

