మైలవరం, సెప్టెంబర్, (పున్నమి ప్రతినిధి)
మైలవరం పట్టణంలో గౌరవ శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు కూటమి నాయకుల ఆధ్వర్యంలో స్వస్థ్ నారీ-సశక్తి అభియాన్ ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో సాధారణ ఆరోగ్య పరీక్షలతోపాటు గైనకాలజికల్ చెకప్లు, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్, కంటి పరీక్షలు, గుండె జబ్బు, మధుమేహం, నోటి క్యాన్సర్, మానసిక వైద్య సేవలు అందించబడ్డాయి. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు, టాటా ట్రస్ట్ సిబ్బంది, పీహెచ్సీ ఉద్యోగులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ శిబిరం ద్వారా మహిళలను స్వశక్తిగా బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సేవలందించారని తెలిపారు. గ్రామస్తులు ఈ అవకాశం వినియోగించుకోవాలని సూచించారు.


